Friday, September 11, 2026

మహిళలు సమాజానికి, భవిష్యత్ తరాలకు నిజమైన స్ఫూర్తి మరియు శక్తి ప్రదాతలు అని నిరూపించిన డా. దీపా బానోత్_

*కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పీహెచ్డీ సాధించిన దీపా బానోత్*

*మహిళలు సమాజానికి, భవిష్యత్ తరాలకు నిజమైన స్ఫూర్తి మరియు శక్తి ప్రదాతలు అని నిరూపించిన డా. దీపా బానోత్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 10:
 
కాప్రా ECILకూ చెందిన ఉస్మానియా యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పరిశోధక విద్యార్థిని శ్రీమతి డా. దీపా బానోత్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పీహెచ్‌డీ పట్టా సాధించారు. ఇద్దరు పిల్లల తల్లిగా, గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ పొందడం అభినందనీయం. డా.దీపా బానోత్ "తెలంగాణలో ఎంపిక చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగుల సంతృప్తిపై తులనాత్మక అధ్యయనం (తెలంగాణ రాష్ట్రంలోని ఎంపిక చేసిన పబ్లిక్ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఉద్యోగుల సంతృప్తిపై తులనాత్మక అధ్యయనం)" అనే అంశంపై పరిశోధన జరిగింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఉద్యోగుల సంతృప్తికి తగిన సూచనలను కూడా ప్రతిపాదించారు. ఈ పరిశోధనను డా. వి .సమున్నత గారి పర్యవేక్షణలో పూర్తి చేశారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీరాములు, డీన్ ప్రొఫెసర్ జహంగీర్, డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు సిబ్బంది డా. దీపా బానోత్‌ను అభినందించారు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలను (పెద్ద కుమారుడు MBBS మరియు చిన్న కుమారుడు ఇంజనీరింగ్) చదువుతున్న సమయంలోనూ కుటుంబ భాద్యతలు చూసుకుంటూ పీహెచ్‌డీ సాధించడం ద్వారా దీపా బానోత్ తన సంకల్పం, పట్టుదల, కృషితో కుటుంబ బాధ్యతలు ఉన్నా ఉన్నత లక్ష్యాలను సాధించినట్లు నిరూపించారు. ఈ సందర్భంగా డా. దీపా బానోత్ తన విజయానికి సహకరించిన తన భర్త శ్రీ రవి తేజకు, కుటుంబ సభ్యులకు మరియు తన పరిశోధన పర్యవేక్షకురాలు డా.వి. సమున్నతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరిశోధన సమయంలో వారు అందించిన నిరంతర ప్రోత్సాహం, సహకారం తన పీహెచ్డీ ప్రయాణంలో కీలకమని ఆమె పేర్కొన్నారు.ఆమె సాధించిన ఈ విజయం కుటుంబ బాధ్యతలతో పాటు ఉన్నత విద్యను కొనసాగించాలని ఆకాంక్షించే మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment