Saturday, September 12, 2026

దళితుల ఇల్లు కూల్చివేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి_

*దళితుల ఇల్లు కూల్చివేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

12 సెప్టెంబర్ 2026, శనివారం నాడు డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ ఆధ్వర్యంలో  మానవ హక్కుల వేదిక కార్యకర్త సంజీవ్, అంబేద్కర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి , హైకోర్టు న్యాయవాది ఎద్దు దివాకర్, సామాజిక కార్యకర్త భాస్కర్ లతో కలిసి గద్వాల జిల్లా, గద్వాల మండలం,రేపల్లె గ్రామాన్ని సందర్శించి దళితుల కూల్చివేత ను పరిశీలించారు. బాధిత కుటుంబంతో గ్రామస్తులతో మాట్లాడి సంఘటన సంబంధించిన వివరాలను సేకరించారు.మాదిగ కులానికి చెందిన అబ్బాయి బోయ కులానికి చెందిన అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకళ్ళను ఒకళ్ళు ఇష్టపడ్డారు. 9 సెప్టెంబర్ 2026 న హైదరాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాదులో  మాసబ్ ట్యాంకు  పోలీసులను కలిసి తాము పెళ్లి చేసు కొన్నామని రక్షణ కల్పించాలని కోరారు. ఇరు కుటుంబాలను పోలీసులు పిలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు. కులాంతర వివాహం పై  ఆగ్రహించిన కుటుంబ సభ్యులు దాదాపు 15 మంది 10 సెప్టెంబర్ 2026 మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో దళితుడైన రంగముని ఇంటిని గడ్డపారలు, ట్రాక్టర్ తదితర వస్తువులతో కాయకష్టం చేసి దళితులు కట్టుకున్న ఇల్లును నేలమట్టం చేశారు. 10వ తారీఖునే FIR నమోదు చేశారు. 6 మందిని అరెస్ట్ చేశారు. అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 12 వ తారీఖున డీఎస్పీ మోగులయ్య రేపల్లె గ్రామాన్ని సందర్శించారు. నిజనిర్ధారణ బృందం డీఎస్పీ మొగులయ్యని, గద్వాల రూరల్  సబ్ ఇన్స్పెక్టర్ని కలిసి, దాడిలో పాల్గొన్న అందర్నీ, దాడికి ప్రోత్సహించిన వారందర్నీ గుర్తించి అరెస్ట్ చేయవలసిందిగా కోరింది. FIR లో నమోదు చేసిన సెక్షన్లతో పాటు, ఆస్తి నష్టానికి సంబంధించిన సెక్షన్లు కూడా నమోదు చేయమని కోరింది.ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం ఇల్లు కూల్చివేసిన వేసిన నిందితుల నుండి నష్టపరిహారాన్ని జరిమాన రూపంలో వసూలు చేసి తిరిగి దళితుల ఇల్లు నిర్మించాలని నిజ నిర్ధారణ బృందం  డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం నిందితులను గ్రామానికి దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు. సంఘటన కేవలం బోయలు చేసింది మాత్రమే కాదని దీని వెనుక ఆధిపత్య రెడ్డి వర్గం ప్రోత్సహించినట్లు వివరించారు. వారిని సైతం గుర్తించి చర్యలు తీసుకోవాలని వెంటనే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేసింది.

No comments:

Post a Comment