Saturday, October 30, 2021

ప్రైవేట్‌ బస్సులో ఈవీఎంల తరలింపు- అనుమానాలు

ప్రైవేట్‌ బస్సులో ఈవీఎంల తరలింపు- అనుమానాలు

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ ఈవీఎంలను తరలిస్తున్న ఆర్టీసీ బస్సులు అర్ధాంతరంగా మార్గమధ్యలో నిలిచిపోవడం అనుమానాలను కలిగిస్తోంది. జమ్మికుంట సమీపంలో గంట సేపు బస్సులని ఆపారు. ఈ బస్సుల్లో.. ఓ బస్సు టైర్ పంక్చర్ కావడంతో ఆపాల్సివచ్చిందని అధికారులు చెబుతున్నప్పటికీ.. అర్థాంతరంగా బస్సులు నిలిచిపోవడం వెనక మరేదైనా కారణాలు ఉన్నాయా లేక పంక్చర్ కావడం వల్లేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు ఈవీఎంలను ప్రైవేటు వాహనంలో తరలిస్తుండగా కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఈవీఎంలు భద్రపరుసున్న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద వాహనాన్ని అడ్డుకున్నారు. ఈవీఎంను ఆర్టీసీ బస్సులో కాకుండా ప్రైవేట్‌ బస్సులో తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి డిమాండ్ తో ఈవీఎంను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు జమ్మికుంట వద్ద బస్సులను ఆపిన వీడియోలను కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఎన్నికల కమిషనర్‌కు పంపారు.

No comments:

Post a Comment