Sunday, October 31, 2021

పునీత్ పార్ధివదేహాన్ని ముద్దాడిన ముఖ్యమంత్రి – ఫోటో వైరల్

పునీత్ పార్ధివదేహాన్ని ముద్దాడిన ముఖ్యమంత్రి – ఫోటో వైరల్

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!


కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తి అయిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ ను కడసారి చూసేందుకు అభిమానులు లక్షల సంఖ్యలో కంఠీరవ స్టేడియం కు చేరుకున్నారు. ఇక పునీత్ అంత్యక్రియలను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై దగ్గరుండి జరిపించారు.

అయితే పునీత్ ను కడసారి చూసుకున్న ముఖ్యమంత్రి పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహానికి ముద్దాడి వీడ్కోలు పలికారు. అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పునీత్ రాజ్ కుమార్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఎంతోమంది పేద ప్రజలకు అండగా నిలబడ్డారు. ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు.

No comments:

Post a Comment