Sunday, October 17, 2021

వర్షాలతో వణుకుతున్న కేరళ.. ఆదుకుంటామన్న అమిత్ షా

జాతీయ వార్తలు : 17/10/2021

వర్షాలతో వణుకుతున్న కేరళ.. ఆదుకుంటామన్న అమిత్ షా

భారీ వర్షాలతో కేరళ వణికిపోతోంది. 11 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటిదాకా వరదల కారణంగా 18 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళను ఆదుకునేందుకు అన్ని విధాలుగా సాయం చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని.. రాష్ట్రంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయని తెలిపారు.

ఇటు రాష్ట్ర‌వ్యాప్తంగా 105 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప‌రిస్థితులకు అనుగుణంగా మ‌రిన్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు సీఎం పినరయి విజయన్. మరోవైపు భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.


No comments:

Post a Comment