ఫోన్ చార్జింగ్ 100 శాతం ఉండటం మంచిది కాదా…?

ఫోన్ లో 80 శాతం చార్జింగ్ ఉన్నా సరే వంద శాతం ఉండాలని పిన్ పెట్టేస్తూ ఉంటారు. సరే అసలు ఫోన్ కి వంద శాతం చార్జింగ్ పెట్టడం ఎంత వరకు మంచిది…?మొబైల్ ఫోన్ కి పూర్తిగా చార్జింగ్ పెట్టడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. 95 శాతం దాటాక ఆపడం ఫోన్ కి చాలా మంచిది. దానికి కారణం వేరే ఉంది. ఫోన్ పూర్తిగా చార్జింగ్ చేస్తే ఎక్కువగా హీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఎక్కువగా హీట్ అవ్వడంతో దీనివల్ల బ్యాటరీ తొందరగా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మొబైల్ ఫోన్ ను 95 శాతం కంటే ఎక్కువ చార్జింగ్ పెట్టడం మంచిది కాదు. అలాగే 20 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉన్నప్పుడు వెంటనే పెట్టడం కూడా మంచిది.20 కంటే ఎక్కువ 95 కంటే తక్కువ చార్జింగ్ మొబైల్ ఫోన్ ఉంటే బ్యాటరీకి లైఫ్ ఎక్కువగా ఉంటుంది.

స్థానికులతో షర్మిల మాట్లాడుతుండగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో కార్యకర్తలు పరుగులు తీశారు. షర్మిలను అనుచరులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. తర్వాత ఆమె యాత్రను కొనసాగించారు.
రోడ్ నెంబర్ 3లో 1,200 గజాల పార్క్ స్థలంలో మున్సిపల్ కార్పొరేషన్ బోర్డు లేదు. కనీసం ఫెన్సింగ్ వేయలేదు. దాన్ని కూడా మింగేసేందుకు భూ బకాసురులు సిద్ధంగా ఉన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. గతంలో రోడ్ నెంబర్ 2లో 2,400 గజాల పార్క్ స్థలం కబ్జా అయితే.. దానిపై ఫిర్యాదు చేయగా ఇంతకుముందున్న కమిషనర్ ఇచ్చిన పర్మిషన్ ను రద్దు చేశారు.అయితే.. ఆ పార్క్ కు బదులు మరోచోట 1,200 గజాల స్థలాలు కబ్జాదారుడికి అధికారులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.10 కోట్ల విలువైన పార్క్ లను కాపాడాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తిపడితే పట్టించుకునేది ఎవరు. ఇందులో సాయి ప్రియ నగర్ అసోసియేషన్ పాత్రపై అనుమానాలు ఉన్నాయి.ప్రభుత్వం పార్క్ స్థలం లేని కారణంగా ఎల్ఆర్ఎస్ లో అదనంగా ప్రతి ప్లాట్ ఓనర్ దగ్గర చార్జీ వసూలు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలు బాధితులను పీడించేలా ఉంటాయి కానీ.. కబ్జాదారుడిపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఉండవు. ఎందుకంటే ఎక్కువ భూములు కబ్జా చేసే బ్యాచ్ లో రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఉంటున్నారు.
సాధారణంగా తాము టార్గెట్ చేసిన పార్టీ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం బీజేపీకి అలవాటే అనే అభిప్రాయం ఉంది. కేంద్ర సంస్థల ద్వారా దాడులు చేయించి కోలుకోలేని దెబ్బ కొడుతుందనే విమర్శలు ఉన్నాయి. కేఎన్ఆర్ సంస్థ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. టీఆర్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఐటీ దాడులు జరగడంతో.. టీఆర్ఎస్ పై బీజేపీ ఫోకస్ చేసిందనే వార్తలు వస్తున్నాయి.