Thursday, September 7, 2023

కేయూ విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తారా....? MLA ఈటల....!

*కేయూ విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తారా....? MLA ఈటల....!*

హైదరాబాద్‌: కేయూ విద్యార్థులను పోలీసులతో దారుణంగా కొట్టించిన ఘటనను దేశం మొత్తం చూస్తోందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..విద్యార్థులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తీసుకెళ్లి కొట్టడం దేశ చరిత్రలో తెలంగాణలోనే జరిగిందన్నారు. విద్యార్థులను కొట్టిన తీరు చూసి న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారన్నారు. విద్యార్థులను ఇంత తీవ్రంగా కొట్టిన ఘతన కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక ఎమ్మెల్సీ ప్రాపకంతో కేయూ వీసీగా వచ్చిన రమేశ్‌.. అప్పటి నుంచి విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారని ధ్వజమెత్తారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment