Sunday, September 17, 2023

మాస్టరూ.... పిల్లలతో ఇవేం పనులు...!

*మాస్టరూ.... పిల్లలతో ఇవేం పనులు...!*

చిన్నారి విద్యార్థుల చేతులతోనే మరుగుదొడ్డిని శుభ్రం చేయించిన సంఘటన తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం అంజూరు ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది.ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో ఒకటి, రెండు తరగతులకు సంబంధించి 15 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు వినియోగించుకునే మరుగుదొడ్డిని ఉపాధ్యాయులు చిన్నారులతోనే శుభ్రం చేయించడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఈవో లక్ష్మీపతిని వివరణ కోరగా.. విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment