Thursday, September 14, 2023

టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తాయి....పవన్ కళ్యాణ్....!

*టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తాయి.... పవన్ కళ్యాణ్....!*

అమరావతి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా  జనసేన  కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌  ప్రకటించారు.రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు తో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ''గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోంది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమ కేసులు పెట్టి రిమాండుకు పంపించారు. వారికి సంఘీభావం ప్రకటించడానికి ఇక్కడకు వచ్చా. చంద్రబాబుతో గతంలో విభేదించి సెపరేటుగా పోటీ చేశా. రాజకీయాల్లో జనసేన తరఫున నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలని, దేశ సమగ్రత బలంగా ఉండాలనుకున్నా. జనసేన ఏర్పాటు చేసినప్పుడు కూడా అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగిందని చెప్పాను. సగటు మనిషి ఆవేదన గురించి మాట్లాడాను. ఆరోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు చాలా మందికి ఇబ్బందిగా మారాయి'' అని అన్నారు.విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలని 2014లో భాజపా, తెదేపాతో కలిసి పోటీ చేశాయి. ఆంధ్రప్రదేశ్‌కు చాలా అనుభవం ఉన్న నాయకుడు కావాలని భావించా. 2020 విజన్‌ గురించి మాట్లాడినప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. ఇవాళ లక్షలాది మాదాపూర్‌ వంటి ఐటీ ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఆయనతో ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే విభేదించా. వ్యక్తిగతంగా ఏనాడూ విభేదించలేదు. రూ.300 కోట్ల స్కామ్‌ పేరు చెప్పి సీఎంకు ఆ అవినీతి మరక అంటగడుతున్నారు. గుజరాత్‌లో ప్రారంభమైన కంపెనీ కాంట్రాక్టు ఇచ్చారు. అది హార్డ్‌వేర్‌ను సప్లయ్‌ చేస్తుంది. ఏదైనా తప్పు జరిగితే అందుకు సంబంధించిన వ్యక్తులను విచారించాలి. అలాంటిది సైబరాబాద్‌ వంటి సిటీని నిర్మించిన వ్యక్తిని ఇలాంటి కేసులో ఇరికించడం బాధాకరం. ఈడీ విచారించాల్సిన ఇలాంటి కేసులను రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. ఇలా చేయడం రాష్ట్రానికి మంచిది కాదు. పోనీ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా మహానుభావుడా. వాజ్‌పేయా? లాల్ బహదూర్‌ శాస్త్రినా? ఈడీ కేసులనుబహదూర్‌ శాస్త్రినా? ఈడీ కేసులను ఎదుర్కొంటున్నాడు. దేశం విడిచి వెళ్లాలంటే కోర్టుల అనుమతి తీసుకుంటున్నాడు. రాజ్యాంగ ఉల్లంఘనలు చేసే వ్యక్తి. అందరినీ భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి''

''డేటా చౌర్యం జరుగుతోందని వాపోయిన వ్యక్తి ఇవాళ వాలంటీరు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అదే పని చేస్తున్నాడు. అడ్డగోలు హామీలిచ్చి వేటినీ అమలు చేయలేదు. అడ్డగోలు దోపిడీ మాత్రమే చేస్తున్నారు. మద్యం విషయంలోనే కోట్లు జేబుల్లోకి వేసుకుంటున్నాడు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రశ్నించడానికే వీలులేకుండా పోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. నాలాంటి వ్యక్తులనే ఏపీ సరిహద్దుల్లో ఆపేస్తున్నారు. అలా ఆపే హక్కు ఎవరికీ లేదు. నమస్కారం పెట్టకూడదు. వాహనంలో నుంచి బయటకు రాకూడదని అంటున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లోనే చెప్పాను. దానికే 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానని కలగన్న వ్యక్తిలో ఉలికిపాటు మొదలైంది. చంద్రబాబు భద్రత విషయాన్ని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తా.యుద్ధం కావాలనుకుంటే యుద్ధానికి సిద్ధమే'' అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

*సుజీవన్ వావిలాల🖋️* 

No comments:

Post a Comment