Tuesday, September 5, 2023

తెలంగాణ ప్రజలతో భాజాపా ఎందుకు మమేకం కావడం లేదు...?

*తెలంగాణ ప్రజలతో భాజాపా ఎందుకు మమేకం కావడం లేదు...?*

 *మాజీ MLA* *మన్నే శ్రీనివాస్ రెడ్డి*
హైదరాబాద్‌: తనకు సస్పెన్షన్‌లు కొత్తకాదని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తాను ఏనాడూ భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు.తెలంగాణ ప్రజల కోసం ఎన్నిసార్లయినా సస్పెన్షన్‌కు గురవుతానని వ్యాఖ్యానించారు. ఇటీవల భాజపా ఆయన్ను సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలతో భాజపా ఎందుకు మమేకం కావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడినా భారాస, భాజపా కలిసిపోయాయని అనుకుంటున్నారని.. మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఘటన తర్వాత ఏం జరిగిందో అర్థం కావడం లేదని శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

*సుజీవన్ వావిలాల🖋️*

No comments:

Post a Comment