Monday, September 18, 2023

ఖైరతాబాద్ వినాయకుడికి.... తొలిపూజ.... హాజరైన గవర్నర్లు...!

*ఖైరతాబాద్ వినాయకుడికి.... తొలిపూజ.... హాజరైన గవర్నర్లు...!*

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణపతికి తొలిపూజ జరిగింది. గణేశుడు ఈసారి 'శ్రీ దశమహా విద్యా గణపతి'గా భక్తులకు దర్శనమిస్తున్నాడు.స్వామి వారికి కుడివైపున లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపు వీరభద్రస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మహా గణపతికి ఉదయం 11 గంటలకు తొలిపూజ జరిగింది. ఈ పూజలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. బడా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరోవైపు అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

*సుజీవన్ వావిలాల🖋️*

No comments:

Post a Comment