Monday, June 26, 2023
తెలంగాణ మలిదశ ఉద్యమకారులు తమ ఆవేదన
కేంద్రం నిధులు.... తెలంగాణకు 2102 కోట్లు....!
*16 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.... తెలంగాణకు 2102 కోట్లు....!*
దిల్లి....దేశంలోని 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్లు కేంద్రం విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించింది. ఏపీకి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 'స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్' పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 50 ఏళ్లకు గానూ వడ్డీలేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రాలకు అందుతుంది. ఈ నేపథ్యంలో రూ.56,415 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో విద్య, వైద్యం, నీటి పారుదుల, మంచినీటి సరఫరా, విద్యుత్, రహదారులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు.ఈ పథకం కింద నిధులు అందుకోనున్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉండగా.. కేరళ, ఏపీ మాత్రం ఈ జాబితాలో లేవు. అత్యధికంగా బిహార్కు రూ.9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇదే తరహా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద రూ.95,147.19 కోట్లకు ఆమోదం తెలపగా.. రూ.81,915.35 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కొవిడ్ అనంతరం రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలన్న ఉద్దేశంతో 2020-21 సంవత్సరంలో ఈ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Sunday, June 25, 2023
MLA రోహిత్ రెడ్డి క్షేమంగా రావడంతో అభిమానుల సందడి!
*MLA రోహిత్ రెడ్డి క్షేమంగా రావడంతో అభిమానుల సందడి!*
*దేవాలయాల్లో పూజలు, ఇంటి వద్ద అభిమానుల కోలాహలం...!*
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో అభిమానులు సందడి చేశారు.తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండలాలతోపాటు తాండూరు పట్టణానికి చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఎమ్మె ల్యే నివాసానికి పెద్దఎత్తున తరలివచ్చారు.
తాండూరు ప్రజలు ప్రేమానురాగాలు, దేవుని కృపతో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రమాదం నుంచి బయట పడటం తో అభిమానులు, నాయకులు దేవాలయాల్లో, చర్చిలలో, మసీదుల్లో, దర్గాలలో ప్రత్యేక పూజలు చేయించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు కొందరు నాయకులు 1101 కొబ్బరికాయలు పగులకొట్టారు. మిఠాయిలు పంచుకున్నారు. టపాకాయలు కాల్చారు. తమ నాయకుడు రోహిత్రెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా తిరిగి రావడంతో అభిమానులు కోలాహానికి అవదులు లేకుండా పో యాయి. ఎమ్మెల్యేను కలిసి క్షేమంగా ఉండాలని నాయకులు, అభిమానులు కోరారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Saturday, June 24, 2023
*పాత్రికేయులకు... త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ.... మంత్రి KTR.....!
*పాత్రికేయులకు... త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ.... మంత్రి KTR.....!*
*న్యూదిల్లి....!*
పాత్రికేయులందరికీ వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు అప్పగించామని తెలిపారు.ఢిల్లీ టీయూడబ్ల్యూజే-143 అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్ అధ్యక్షతన శనివారం పాత్రికేయుల బృందం మంత్రి కేటీఆర్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు.
దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. హైదరాబాదు లోని పాత్రికేయులందరికీ స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇందులోనే ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయుల్ని సైతం చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జీవోలో ఆ అంశాలను పొందుపరుస్తామన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి, హైదరాబాద్ పాత్రికేయులకు ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. భేటీలో బీఆర్ఎస్ ఎంపీలు గడ్డం రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఉన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
షాద్ నగర్లో ధరణి దొంగలు
షాద్ నగర్లో ధరణి దొంగలు
at
– రికార్డుల్లో పేరొచ్చిందని దోపిడీ
– అధికారుల సహకారంతో రూ.వందల కోట్ల భూస్కాములు
– 90 మంది వృద్ధుల ప్లాట్స్ కు టోకరా?
– చక్రం తిప్పిన రెవెన్యూ అధికారులు!
– తక్కువలో కొని.. ఎక్కువ లాభాలకు అమ్మకం
– తన్నుకు చావండి.. మేము సేఫ్ అంటున్న రియల్టర్స్
– డీటీసీపీ వర్సెస్ హెచ్ఎండీఏ లే అవుట్స్ రగడ
క్రైంబ్యూరో, తొలివెలుగు:హైదరాబాద్ శివార్లలో ఎకరం భూమి ఎక్కడ చూసినా రూ.10 కోట్లకు తక్కువ లేదు. అలాంటప్పుడు హైదరాబాద్-బెంగళూరు హైవేకి ఆనుకుని వున్న భూమిలో యజమానిగా తాతల పేరు ధరణిలో కనిపిస్తే ఈ తరం వాళ్లు ఊరుకుంటారా? ఎలాంటి పొజిషన్ లేకున్నా.. తాతలు చనిపోయి పదేళ్లు దాటినా.. ఆ భూమిని కొట్టేసేందుకు చట్టాల్లోని లొసుగులను వాడేస్తున్నారు. హెచ్ఎండీఏ అనుమతులు అంటూ ఎల్పీ నెంబర్ తో అమ్మేసుకుని కోట్లు గడిస్తూ పరార్ అవుతున్నారు. ఇలా గ్రామ పంచాయతీ, డీటీసీపీ లే అవుట్స్ చేసి అమ్మిన ప్లాట్స్ కు ఇంకా రైతుబంధు తింటూ లిటిగేషన్ సృష్టిస్తున్నారు. దీనికి చక్కటి ఉదాహరణే షాద్ నగర్ ఫారుఖ్ నగర్ లోని 8 ఎకరాల లే అవుట్.

జరిగింది ఇదే..!
హైదరాబాద్-బెంగుళూరు హైవేకి ఆనుకుని ఉన్న కొత్తూరు శివారులోని తిమ్మాపూర్ సర్వే నెంబర్ 97, 98లోని 10 ఎకరాల భూమి. దాన్ని అన్నీ లీగల్ గా చూసుకుని 6 ఎకరాలు డీటీసీపీ లే అవుట్ తో ప్లాట్స్ అమ్మకాలను జరిపాయి జన సాయి హౌసింగ్, సుప్రజ హౌసింగ్. ఇందులోని రోడ్లు, పార్క్ ప్లేస్ అంతా తిమ్మాపూర్ గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, 2019 తర్వాత అసలు కథ మొదలైంది. తహసీల్దార్ ఆఫీస్ లో పనిచేసే భాను, రిటైర్డ్ ఎమ్మార్వో వెంకట్ రెడ్డి కలిసి ఆ భూమికి పట్టా పాసు బుక్ ఇచ్చి వివాదం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఐపీఎస్ లు, ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పలువురు ప్రముఖులు ప్లాట్స్ తీసుకున్నారంటే ఆ భూమి విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి లే అవుట్ లోని భూమిలో ధరణి వచ్చాక మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు ప్లాట్స్ కొన్నవారు. 2009లో మరణించిన కొండ అంజయ్య(గతంలో భూ యజమాని) పేరు ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చింది. 2018 ఫిబ్రవరి 15న కొండయ్య వారసులు డెత్ సర్టిఫికేట్ సమర్పించి ఆయన భార్య రాధమ్మ పేరు మీద 2019లో పాస్ బుక్స్ తీసుకున్నారు. ఆ తర్వాత వెంటవెంటనే బొల్లినేని శ్రీవల్లి, పత్తిపాటి శ్రీధర్ పేర్ల మీదకి ఆ భూమి వచ్చేసింది. సంజీవని పేరుతో కలర్ ఫుల్ బ్రౌచర్స్ వేయించి ఓపెన్ స్పేస్ అంతా అమ్మకాలు జరిపారు. రీ లే అవుట్ చేసి మూడు నెలల్లోనే రూ.25 కోట్లు దండుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

డీటీసీపీ వర్సెస్ హెచ్ఎండీఏ!
2005 నాటికి అమలులో ఉన్న చట్టానికి అనుకూలంగా లే అవుట్ తో ఉన్న భూమికి హెచ్ఎండీఏ మళ్లీ అనుమతులు ఇవ్వడంతో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. వృద్ధులైన ప్లాట్ ఓనర్స్ నగరంలోనే ఉండేవారు. దీంతో ఇష్టానుసారంగా సంజీవని ప్రాజెక్ట్స్ ఆ ప్లాట్స్ ను అమ్ముకున్నారని ఆరోపణలు వున్నాయి. రెండేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే ప్లాట్ ఓనర్స్ వెళ్లి చూడగా.. డీటీసీపీ లే అవుట్ ప్లాట్స్ ను భూ మాఫియా మింగేసిందని వాపోతున్నారు. హుటాహుటిన కోర్టుకు వెళ్లి అక్రమ పాస్ బుక్స్ ను సస్పెండ్ చేయించారు. హెచ్ఎండీఏలో ఫిర్యాదు కూడా చేశారు. కానీ, అప్పటికే రూ.25 కోట్లు తీసుకున్న రియల్టర్స్ మాత్రం.. తమకు సంబంధం లేదని మీరంతా కొట్టుకు చావండి అంటున్నారని కొత్తగా ప్లాట్స్ కొన్న వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుంటే.. 200 నుంచి 500 గజాల వరకు అమ్మకాలు చేసి బిజినెస్ చేస్తారు. కానీ, తప్పుడు సమాచారం ఇచ్చి పూర్తి అనుమతులు అంటూ.. ఒక్కొక్కరికి 700 గజాల నుంచి 2,500 గజాల వరకు అమ్మేశారని అంటున్నారు. గతంలో కొనుగోలు చేసిన వారు.. తాజాగా కొనుగోలు చేసిన వారు కొట్టుకోని చావండని.. తాము, అధికారులు రెండేళ్లలో రూ.25 కోట్లు వెనకేసుకున్నాం అంటూ బొల్లినేని శ్రీవల్లి, పత్తిపాటి శ్రీధర్ నేరుగా చెబుతున్నారంటూ వారంతా వాపోతున్నారు. అక్రమ పాస్ బుక్స్ ను సస్పెండ్ చేయించినా ధన బలం, ఎమ్మెల్యే అంజయ్య అండదండలతో చుట్టూ ప్రహరీ గొడలు నిర్మిస్తున్నారని ప్లాట్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు.

హెచ్ఎండీఏ ఎం చేస్తోంది?
సైబర్ మోసగాళ్లు తాము చట్టానికి దొరక్కుండా ఉండేందుకు సిమ్ కార్డులు ఎలా మారుస్తారో.. అలాగే అక్రమ ప్రాజెక్ట్స్ చేసే రియల్టర్స్ కూడా తప్పుడు పత్రాలతో అప్లికేషన్స్ పెట్టి.. జనాలను మోసం చేస్తున్నారని ఆరోపణలు వున్నాయి. తాము చేసేందే కరెక్ట్ అంటూ పోలీసులు, పొలిటిషన్స్ ముందు కలరింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు. దోచుకుని.. తలా కొంత ఇచ్చిన వారికే మద్దతు పలకడం కామన్ గా మారిందని వాపోతున్నారు. అసలు రికార్డ్స్ ఏంటి? ఎవరెవరు ఏ ప్రాంతంలో పొజిషన్స్ లో ఉన్నారు? 2019లో వ్యవసాయ భూమి అంటే ఎలా సాధ్యమో కనీసం గుర్తించకపోవడం… మున్సిపాలిటీ ఆథారిటీ అధికారులు ఇప్పటికీ లేకపోవడం నగర శివారులోని వారికి శాపంగా మారిందంటున్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ చేశామని చేతులు దులుపుకున్నారని చెబుతున్నారు.

రిటైర్డ్ ఎమ్మార్వో నిర్వాకంతోనే గొడవలు!
డీటీసీపీ లే అవుట్స్ లో భాగంగా 2005లో 6 ఎకరాలు నాలా కన్వర్షన్ అయింది. గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ లు పూర్తి చేశారు. కానీ, మళ్లీ అదే ప్రాంతంలో 2019లో అక్కడ వ్యవసాయం సాగు చేస్తున్నట్లు అప్పటి తహసీల్దార్ పంచనామా రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. మళ్లీ నాలా కన్వర్షన్ చేశారని, ఒకే భూమికి రెండు సార్లు ఎలా చేశారో వారికే తెలియాలని గ్రామస్తులు అనుకుంటున్నారు. రిటైర్డ్ అయ్యే ముందు అడ్డగోలు వ్యవహారాలు చేసి.. కోట్లాది రూపాయలు రియల్టర్స్ కి దొచిపెట్టేందుకు కారకులు అయ్యారంటూ ప్లాట్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు.