Thursday, December 15, 2022
యువరాజు పట్టాభిషేకం కోసంరాజ శ్యామల యజ్ఞం
నాటి కుట్రను బహిరంగపర్చిన 'ఆదాబ్ హైదరాబాద్'
Tuesday, December 13, 2022
#చట్టాలు అంటే చులకన అయిపొయింది
Monday, December 12, 2022
కేసీఆర్ వైఖరే.. బెటర్ అనుకుంటున్న సన్నిహితులు
Sunday, December 11, 2022
తెలంగాణలో 1,309 మంది రైతులు మృత్యువాత పడ్డారు
*_ఉరికొయ్యకు రైతన్న_*
_● ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 41,369 మంది_
_● తెలంగాణలో గత 3ఏళ్లలో 1,309_
_● ఏపీలో 1,673మంది రైతుల ఆత్మహత్య_
_● అధిక శాతం కౌలు రైతులే.!_
Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం, 9440000009)_*
*_స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు. ఇంకా రైతుల ఆత్మహత్యలు అంటే.. ఎక్కడో లోపం ఉంది. అది పసిగట్టలేని పాలకులు 'రాజకీయ పాచికలు' ఆడటం తప్ప లోతైన శోధన చేయడం లేదు. 'రైతు బంధు' అమలు చేస్తున్న తెలంగాణలో సైతం 2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో 1,309 మంది రైతులు, ఆంధ్రప్రదేశ్లో 1,673 మంది రైతులు మృత్యువాత పడ్డారు. దీనికి అంతం ఎప్పుడు.? అస్సలు అంతం ఉందా..? లేదా..?_*
*_అసలేం జరిగిందంటే..?:_*
గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. తెలంగాణలో తగ్గుముఖం పట్టాయని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్లో తెలిపింది. 2019 నుంచి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజ్యసభలో వెల్లడించారు.
*_నివేదికలో ఏముంది.?:_*
2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 1,673 మంది రైతులు మృత్యువాత పడగా, తెలంగాణలో 1,309 మంది తనువు చాలించినట్టు కేంద్రం పేర్కొంది. దేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
*_తెలంగాణలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు:_*
దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టగా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు సంభవించాయని తెలిపింది. 2017లో 375 మంది, 2018లో 365 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 2017, 2018 సంవత్సరాలతో పోల్చితే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. 2017లో తెలంగాణాలో 846 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2021 నాటికి ఆ సంఖ్య 352 కు తగ్గిందని పేర్కొంది. దక్షిణ భారతంలో అధిక ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉంది. కర్ణాటక మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతోందని కేంద్రం తెలిపింది.
*_దేశవ్యాప్తంగా..:_*
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. 2017 నుంచి 2021 మధ్యకాలంలో రాష్ట్రంలో 41,369 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. 2019లో రాష్ట్రంలో 7,675 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2020నాటికి ఆ సంఖ్య 8058కి, 2021లో 10,171కి పెరిగినట్టు తెలిపారు.
*_సిగ్గుగా లేదూ..:_*
అందరికీ అన్నం పెట్టే రైతన్న ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. దీని కోసం ప్రభుత్వాలు, పాలకులు ఆలోచించే తీరిక లేదా..? ఆత్మహత్యలు తగ్గుతున్నాయని చెప్పి చంకలు గుద్దుకోవడం కాదు. అస్సలు లేవని చెప్పే రోజు రావాలని ఆశిద్దాం. దానికోసం ఉద్యమించాల్సిన తరుణం ఇదే..! జై కిసాన్..
బాక్స్:
*_గుర్తించిన అంశాలు_*
* ఆత్మహత్యకు పాల్పడిన వారిలో దాదాపు అందరూ కౌలు రైతులే.
* చేసిన అప్పు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు.
* జీఓ 43 ప్రకారం వీరెవరికీ ఆర్థిక సాయం, పునరావాస ప్యాకేజీ అందలేదు. ఆర్డీవో, వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ), డీఎస్పీ గ్రామాలను సందర్శించలేదు. చాలా కేసుల్లో తహసీల్దారు, ఏఓ, ఎస్ఐతో కూడిన మండలస్థాయి కమిటీ ప్రాథమిక విచారణ జరిపి వివరాలు తీసుకోవడం లేదు.
* ఎక్కువ మంది మిర్చి, పత్తి సాగు చేస్తున్నవారే.
* ఎవరికీ కౌలు రైతు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ) లేవు.
* బాధిత కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
* ప్రైవేటు అప్పులే దిక్కయ్యాయి. వీరెవరికీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రుణాలు అందలేదు.
Friday, December 9, 2022
పేరు మారితే జాతీయ పార్టీ కాదు..!
*_ఇదేం పాత్రికేయం.!_*
_● కొత్త జాతీయ పార్టీ ఆప్.._
_● బీఆర్ఎస్ కాదు.._
_● అప్పుడే అంత సీన్ లేదు_
_● సొంత పత్రిక ఓవరాక్షన్.!_
_● మరెందుకీ గోబెల్స్ ప్రచారం…?_
_● పేరు మారితే జాతీయ పార్టీ కాదు..!_
_● ఇక మిగిలింది ఎవరబ్బా..!!_
Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం, 9440000009)_*
*_మళ్లీ మళ్లీ అదే పిచ్చిమోత.. పార్టీ పేరు మారితే జాతీయ పార్టీ అయిపోయినట్టు 'బబ్రాజమానం భజగోవిందం' తరహా పిచ్చి ప్రచారం.. టీఆర్ఎస్ పార్టీ విధేయ మీడియాలోనూ అదే ధోరణి.. పాత్రికేయాన్ని పాతరేసి, కరపాత్రికేయాన్ని మోస్తున్న వైఖరి.. ఎస్, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పేరు మార్చుకుంది.. దాని ఓనర్కు ప్రధాని కుర్చీ కావాలట..! అదెలాగూ ఆయన సొంత పార్టీ.. తన ఇష్టం.. తను చెప్పిందే వేదం.. తను చేసిందే శాసనం.. మేల్ శివగామి స్టయిల్.. మళ్లీ నాలుగు రోజులకు నో, నో, నా తెలంగాణ, జై తెలంగాణ అంటూ మళ్లీ పేరు మార్చుకున్నా సరే, ఆహాశ్చర్యమే అవసరం లేదు..! దయచేసి మీ 'భ్రమల లోకం'లోకి ప్రజలను లాగకండి..వారిని వారిలాగే ఉండనివ్వండి. లేకుంటే భవిష్యత్తులో 'దేవతావస్త్రాలు' ప్రాప్తిరస్తు.!_*
*_సొంత పత్రిక ఓవరాక్షన్..:_*
ఈరోజు కూడా సారు గారి సొంత పత్రిక ఓవరాక్షన్.. అదేదో గొప్ప రాజకీయ పరిణామం అయినట్టుగా.. నిజంగానే టీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోయినట్టుగా.. దేశ రాజకీయ యవనికపై మన జయపతాక అట.! ఎన్నికల సంఘం రాజముద్ర వేయడం జయపతాక ఎగరేసినట్టా..? జాతీయ స్థాయికి 'కొత్త ధ్రువతార కేసీయార్' అంటూ మరో డెక్కు.. మామూలుగా 'ధ్రువతార' అని ఏ సందర్భాల్లో వాడతామో తెలుసా వీళ్లకు అసలు..?
*_ఇదేం ఖర్మ..!:_*
ఒక్క నమస్తే తెలంగాణ మాత్రమే కాదు, దాదాపు కేసీయార్ అదుపాజ్ఞల్లో ఉన్న ప్రతి పత్రిక, ప్రతి టీవీ అంతే.. హబ్బా, జస్ట్, పేరు మారిందే తప్ప, నీకు నువ్వు 'జాతీయ పార్టీ' అని చెప్పుకోవడం తప్ప.. కేంద్ర ఎన్నికల సంఘం నిన్ను జాతీయ పార్టీ అనడం లేదు బాబూ.., పేరు మార్పుకు 'అంగీకరించాం' అని లేఖ పంపించింది. అంతే..!
*_మరెందుకీ గోబెల్స్ ప్రచారం…?:_*
పేరులో తెలంగాణ ఉంది కాబట్టి.. అది మరీ ప్రాంతీయతను సూచిస్తున్నది కాబట్టి, తనకు జాతీయ స్థాయి కావాలి కాబట్టి.. దానికంటూ ఓ కొత్త పార్టీ పెడితే కొన్ని కొత్త చిక్కులు వస్తాయి కాబట్టి.... తెలంగాణతనాన్ని వదిలేసింది. 'భారత రాష్ట్ర సమితి' అని స్వీయ నామకరణం చేసుకుంది. అంతకుమించి ఇప్పటికిప్పుడు జరిగింది లేదు, ఒరిగిందీ లేదు. మరెందుకీ గోబెల్స్ ప్రచారం..?
*_ఇదేం పాత్రికేయం:_*
నిజానికి వార్త అంటే ఆప్ జాతీయ పార్టీగా అవతరించడం.. హఠాత్తుగా రాత్రికిరాత్రి 'అబ్రకదబ్ర' అని గాలిలో మంత్రదండం ఊపి, జాతీయ పార్టీ అయిపోలేదు అది. పార్టీ పేరు సేమ్. మెల్లిమెల్లిగా ఒక్కో రాష్ట్రానికి అక్టోపస్లా చేతులు విస్తరిస్తూ..ఓట్లు సాధిస్తూ.. నిజంగానే జాతీయ పార్టీ అయ్యింది. ఒక్కసారి ఈ వార్త చూడండి.
*_'ఆప్' వెనుక ఎంతో శ్రమ, నిజాయితీ:_*
ఇదీ వార్త. కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి. నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు సాధించి ఉండాలి. లాస్ట్ ఎన్నికల్లో కనీసం 2 శాతం సీట్లను కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి. ఆప్ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అప్పట్లో గోవాలో 6.77 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు గుజరాత్లో పది శాతం దాటి ఓట్లు తెచ్చుకుంది. హిమాచల్లో పెద్ద రిజల్ట్ లేకపోయినా ఓట్ల శాతం బాగానే పెంచుకుంది.
*_పేరు మారితే జాతీయ పార్టీ కాదు..:_*
సో, జాతీయ పార్టీగా గుర్తింపుకు అర్హత సాధించింది. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్కన్నా తన తోక లేదా తను తోకగా ఉన్న మజ్లిస్ను జాతీయ పార్టీ అనాలి. యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఉనికి ఉంది, కొన్ని ఓట్లు ఉన్నయ్, కొన్ని సీట్లు ఉన్నయ్.! ప్రస్తుతం అధికారికంగా కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, టీఎంసీ మాత్రమే జాతీయ పార్టీలు. ఆప్ ఎనిమిదో జాతీయ పార్టీ. ఏమో, సరిగ్గా లెక్కలు తీస్తే రాబోయే రోజుల్లో మజ్లిస్ దరఖాస్తు చేసుకోవచ్చునేమో.! అదే రాబోయే రోజుల్లో సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, టీఎంసీ తమ జాతీయ హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. అంతే తప్ప, మేం 'జాతీయమహో' అని డప్పు చాటుకుంటే జాతీయ పార్టీ కాలేదు ఏ పార్టీ..!!
*_హేమిటో..:_*
అతిశయోక్తులు, అతిభజన నిజమైన నాయకుడిని ఆవిష్కరించలేవు.. ఆచరణ, ఫలితాలే దేనికైనా గీటురాయి.. గతంలో ఇదే నమస్తే తెలంగాణ 'అతిశయోక్తి' అనే పదమే 'అతి' అని అంగీకరించిన తరహాలో ఓ బొమ్మ, ఓ వార్త వడ్డించింది.. జస్ట్, పార్టీ పేరు మార్పిడి పథకానికి గాంధీ క్విట్ ఇండియా మూమెంట్కు లంకె పెట్టినట్టుగా... అంత కలరింగ్ ఇచ్చింది పత్రిక.. అప్పట్లో, యాభై ఏళ్ల కింద జయప్రకాశ్ నారాయణ ఇందిర ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన మహోజ్వల ఘట్టంతో పోల్చింది... ఇలా..!
*_ఇక మిగిలింది ఎవరబ్బా..!!_*
జనసేన యుద్దవాహనం సిద్ధమైంది కదా.! ఇక కొండగట్టులో పూజలు చేసి, ఆయుధం పట్టి, యుద్ధభేరి మోగించడమే.! రెండు రాష్ట్రాలు.. అదీ జాతీయ పార్టీయే.. తెలుగుదేశం పార్టీని కూడా జాతీయీకరించేసి, 'భారతదేశం' అని పేరు మార్చేసి, తమిళనాడు, కర్నాటక, ఒడిశా, అండమాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని చాటడమే.! కేఏపాల్ది ఎలాగూ అంతర్జాతీయ పార్టీ..! దానికి ఏ ఫరక్ పడదు.! నిఖార్సయిన తెలంగాణతనానికి నిలువెత్తు ముఖచిత్రం షర్మిలకు జాతీయ సంకల్పాలు, లక్ష్యాలు ఎటూ లేవు..! ఇక మిగిలింది ఎవరబ్బా...!!