Sunday, December 11, 2022

తెలంగాణలో 1,309 మంది రైతులు మృత్యువాత పడ్డారు

*_ఉరికొయ్యకు రైతన్న_*
_● ఐదేళ్లలో దేశవ్యాప్తంగా  41,369 మంది_
_● తెలంగాణలో గత 3ఏళ్లలో 1,309_
_● ఏపీలో 1,673మంది రైతుల ఆత్మహత్య_
_● అధిక శాతం కౌలు రైతులే.!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం, 9440000009)_*

*_స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు. ఇంకా రైతుల ఆత్మహత్యలు అంటే.. ఎక్కడో లోపం ఉంది. అది పసిగట్టలేని పాలకులు 'రాజకీయ పాచికలు' ఆడటం తప్ప లోతైన శోధన చేయడం లేదు. 'రైతు బంధు' అమలు చేస్తున్న తెలంగాణలో సైతం 2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో 1,309 మంది రైతులు, ఆంధ్రప్రదేశ్‌లో 1,673 మంది రైతులు మృత్యువాత పడ్డారు. దీనికి అంతం ఎప్పుడు.? అస్సలు అంతం ఉందా..? లేదా..?_*

*_అసలేం జరిగిందంటే..?:_*
గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. తెలంగాణలో తగ్గుముఖం పట్టాయని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్‌లో తెలిపింది. 2019 నుంచి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాజ్యసభలో వెల్లడించారు.

*_నివేదికలో ఏముంది.?:_*
2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,673 మంది రైతులు మృత్యువాత పడగా, తెలంగాణలో 1,309 మంది తనువు చాలించినట్టు కేంద్రం పేర్కొంది. దేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

*_తెలంగాణలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు:_*
దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టగా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు సంభవించాయని తెలిపింది. 2017లో 375 మంది, 2018లో 365 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 2017, 2018 సంవత్సరాలతో పోల్చితే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. 2017లో తెలంగాణాలో 846 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2021 నాటికి ఆ సంఖ్య 352 కు తగ్గిందని పేర్కొంది. దక్షిణ భారతంలో అధిక ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో ఉంది. కర్ణాటక మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతోందని కేంద్రం తెలిపింది.

*_దేశవ్యాప్తంగా..:_*
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. 2017 నుంచి 2021 మధ్యకాలంలో రాష్ట్రంలో 41,369 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు. 2019లో రాష్ట్రంలో 7,675 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2020నాటికి ఆ సంఖ్య 8058కి, 2021లో 10,171కి పెరిగినట్టు తెలిపారు.

*_సిగ్గుగా లేదూ..:_*
అందరికీ అన్నం పెట్టే రైతన్న ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. దీని కోసం ప్రభుత్వాలు, పాలకులు ఆలోచించే తీరిక లేదా..? ఆత్మహత్యలు తగ్గుతున్నాయని చెప్పి చంకలు గుద్దుకోవడం కాదు. అస్సలు లేవని చెప్పే రోజు రావాలని ఆశిద్దాం. దానికోసం ఉద్యమించాల్సిన తరుణం ఇదే..! జై కిసాన్..

బాక్స్:
*_గుర్తించిన అంశాలు_*
* ఆత్మహత్యకు పాల్పడిన వారిలో దాదాపు అందరూ కౌలు రైతులే.
* చేసిన అప్పు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు.
* జీఓ 43 ప్రకారం వీరెవరికీ ఆర్థిక సాయం, పునరావాస ప్యాకేజీ అందలేదు. ఆర్డీవో, వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ), డీఎస్పీ గ్రామాలను సందర్శించలేదు. చాలా కేసుల్లో తహసీల్దారు, ఏఓ, ఎస్‌ఐతో కూడిన మండలస్థాయి కమిటీ ప్రాథమిక విచారణ జరిపి వివరాలు తీసుకోవడం లేదు.
* ఎక్కువ మంది మిర్చి, పత్తి సాగు చేస్తున్నవారే.
* ఎవరికీ కౌలు రైతు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ) లేవు.
* బాధిత కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
* ప్రైవేటు అప్పులే దిక్కయ్యాయి. వీరెవరికీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రుణాలు అందలేదు.

No comments:

Post a Comment