Thursday, December 15, 2022

యువరాజు పట్టాభిషేకం కోసంరాజ శ్యామల యజ్ఞం

*నాడు పోరాటాలకు నిలయమైన తెలంగాణ...*
*నేడు యాగాలకు, భోగాలకు నిలయమైంది*

భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు తెలంగాణ అంటే.. భూమి కోసం, భుక్తి కోసం, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నడిచిన..
సాయుధ రైతాంగ పోరాటం..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో తెలంగాణా అంటే...
ఇడ్లి సాంబార్ గోబ్యాక్.. నాన్ ముల్కీ ఘర్ వాపస్..

దేశ స్వాతంత్య్రం తర్వాత అరవై తొమ్మిదిలో, తెలంగాణ అంటే... 
ప్రాణాలకు తెగించి యువతరం పోరాడిన ప్రత్యేక తెలంగాణా తొలి దశ ఉద్యమం. మూడువందల ఆరవై మంది బలిదానం.

ఎనభై ల్లో తెలంగాణ అంటే... 
దొరతనాలను గడగడలాడించి, దొరగడిలను కూల్చి.. భూస్వామ్యానికి సవాల్ విసిరిన సాయుధ విప్లవ ప్రభంజనం.

గత దశాబ్దంలో తెలంగాణ అంటే... 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కై పట్టువదలని ప్రజా ఉద్యమం. మలిదశలో పద్నాలుగు వందల మంది ఆత్మార్పణం.. సంఘమే రణరంగమై..రాష్ట్ర సాధనే ద్యేయంగా నడిచిన ఉద్యమం.

ఈ రోజు తెలంగాణా అంటే..
కుట్రల,కుతంత్రాల, కుటుంబ పాలన కోసం..
కూడబెట్టిన ధనం, యువరాజు పట్టాభిషేకం కోసం
రాజ శ్యామల యజ్ఞం.

రేపటి తెలంగాణ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలన్నదే నేడు సబ్బండ వర్గాల, వర్ణాల ముందున్న ప్రశ్న..
తెలంగాణ అంటేనే పోరాటం...పోరాటం... 
కాళోజీ మాటలు మనకు మర్చిపోతున్నారా..
*ప్రాంతేతరు మోసం చేస్తే ప్రాంతం అవతలి వరకు తరిమి కోడతాం.. *ప్రాంతంలోని వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం*

Courtesy by : Voice Of Village (fb)

No comments:

Post a Comment