Monday, June 13, 2022

ఘటన చూసి సిగ్గుపడాలి మనమందరం... Bplkm🪶

https://twitter.com/TPrashanth985/status/1536152603394195456?t=AC43hKI5ZO9lledT9Ue2nQ&s=08  *గౌరవెల్లి ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలలోకి అర్ధరాత్రి వెయ్యి మందికి పైగా పోలీసులు వచ్చి దాడి చేసి 4 వ్యాన్లలో ఎక్కించుకెల్లిన పొలీసులు.హుస్నాబాద్ నియోజకవర్గం, గౌరవెళ్ళి ప్రాజెక్ట్ కిందా భూములు కోల్పోయిన గూడటిపల్లె గ్రామం వారికి నష్ట పరిహారం ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా వాళ్ళ ఊర్ల కాళీ చేయమంటున్నారు.వాళ్లు నష్ట పరిహారం కోసం చాలా రోజుల నుండి ప్రాజెక్ట్ దగ్గర ధర్నా చేస్తున్నారు.అయిన ప్రభుత్వం స్పందిచట్లేదు.నిన్న రాత్రి 2 గంటలకు గ్రామానికీ వెళ్ళీ ఎవరు దొరికిన పోలీసు Van లో ఎక్కించారు.ఒక్క మహిళ పోలీసు కూడా లేరు కానీ వద్దు అని అడ్డం వచ్చిన మహిళలను కూడా విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ చేసారు* https://t.co/3YTDvGMzZJ
#FalthuTSPolice @TelanganaDGP @siddipetcp @siddipet2tn_ps @siddipet1tn_ps @Collector_SDPT @bandisanjay_bjp @TeenmarMallanna @Arvindharmapuri https://t.co/ktBdCLLU8W
---------------------------------------------------------


https://twitter.com/Praja_Snklpm/status/1536328569411891202?t=HfE3ZAPEALXICqv0wQFoTw&s=08  *@India_NHRC plz involve 🙏*   *గౌరవెల్లి ఘటన చూసి సిగ్గుపడాలి మనమందరం. మానవత్వం లేని తెలంగాణ ప్రభుత్వం & ప్రభుత్వ అధికారులు😔.... Bplkm🪶*
#indianconsitution #fundamentalrights
#Telangana https://t.co/ILlosw807z

Saturday, June 11, 2022

అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా మహనీయుడు అచ్యుత్ రావు సర్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము

@AnooradhaR

ఈరోజు బాలకార్మికుల గురించి మాట్లాడే వారు ఒక దేవుడిని మరిచిపోయారు... ఆ దేవుడు ఎవరు అంటే స్వర్గీయ అచ్యుత్ రావు సర్ గారు 🙏.

బాలకార్మికుల వ్యవస్థ మార్పుకోసం తనజీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు.

@TelanganaCMO @AndhraPradeshCM
@KTRTRS https://t.co/5Cz0VIAngD https://t.co/IoPfMQWDjK

_-----------------------------------------------

https://twitter.com/AnooradhaR/status/1535871799925190656?t=oiu5Mp36Ql0dJMOlS0xd7g&s=19
బాలకార్మికుల గురించి మాట్లాడే వారు,వారికి రక్షణకల్పించేవారు,
వారి కోసం పోరాటం చేసేవారు లేరు. నాకున్న పరిధి లో నా తుది శ్వాస వరకు నేను అచ్యుత రావు గారి కోసం పని చేస్తాను.

ToThe Judicial ConsultantNational Green TribunalSouth ZoneChennai.

Hyderabad  11 june 2022

To
The Judicial Consultant
National Green Tribunal
South Zone
Chennai.

Your Honour,

We draw your prompt attention to our earlier email representation dated 7 sep 2020(appended below), addressed to the Khammam District WALTA Authority and to the Government of Telangana, seeking eviction of encroachments, viz.,sequel resorts , roads, and other land dumping and structures inside Lakkaram cheruvu , substantiating with official maps including Dharani maps. 

we sought restoration of the lakkaram cheruvu to its original glory.  But under the active supervision of government of Telangana, we have observed that the cheruvu has been noosed around against irrigation rules and standards and against environmental standards and against Supreme Court orders.

Plz see the google earth satellite imageries below how the extinction of the huge lakkaram cheruvu is being staged as 'beautification' by condoning all the encroachments both state and private.

a) Lakkaram lake as on November 2006:
Lake is not divided and the width of lake is seen to almost full extent. however, sequel resorts already encroached the lake.

lakkaram cheruvu nov 2006 .png


b) Lakkaram cheruvu in April 2014:
Lake has been divided thru roads/bunds and massive encroachments both state and private inside FTL boundary and buffer zone.

lakkaram cheruvu april 2014 .png


c) Lakkaram lake in March 2022:
Huge concretization of the lake is observed in the name of 'beautification' and 'development' thus depriving the gullible citizens of water spaces that are basic essentials of survival. North east a huge land fill inside the FTL of the lake is seen.

lakkaram cheruvu march 2022 .png

We hope the above has shocked the conscience of the National GreenTribunal Southern Bench, Chennai.  We urge the Tribunal to take this up promptly and order eviction of the encroachments , roads, bunds, landfills, resorts, clubs, convention halls, etc. etc. and restore the lake as a basic essential for humanity and bio diversity.
We shall assist the Tribunal as our Fundamental Duty to our country as enshrined in our Constitution of India.

The Government of Telangana is totally disconnected with the climate crisis and the existential threat that the whole world including the National Green Tribunal is trying to combat.

best
Dr Lubna Sarwath,
State President,
Water Resources Council- Womens Indian Chamber of Commerce and Industry
Hyderabad

సీఎం పదవికి కేసీఆర్ గుడ్ బై?

సీఎం పదవికి కేసీఆర్ గుడ్ బై?

Courtesy by : Disha Media Web 
11 June 2022 12:28 PM దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు తగ్గించడం లేదు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో ఢీ కొట్టేందుకే ఆసక్తి చూపుతున్నారు. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న కేసీఆర్.. తాను ఏర్పాటు చేయబోది ఫ్రంట్ కాదు.. కొత్త టెంటే అనే సంకేతాలు ఇచ్చేశారు. ఈ నెలాఖరులో కొత్త పార్టీకి అంకురార్పణ జరగబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇంటి పార్టీగా కొనసాగిన టీఆర్ఎస్ ఇకపై భారత రాష్ట్ర సమితిగా అవతరించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే హిందీ బెల్ట్ లో తనదైన చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్.. ఆ పనిని తెలంగాణలో కూర్చొని చేయాలంటే అసాధ్యం అనే మాట వినిపిస్తోంది. అందువల్ల త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారనే ఆసక్తికర చర్చ తెరపైకి వస్తోంది. Also Read - ఆ మంత్రికి షాక్.. TRS ఫ్లెక్సీలో రేవంత్ రెడ్డి ఫొటో కుర్చీని వదులుకుంటే కేసీఆర్ పరిస్థితేంటి? ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లాలంటే సీఎం పదవికి గుడ్ బై చెప్పాలనే వాదన బాగానే ఉన్నా.. ఆ పదవిని కేసీఆర్ వదులుకుంటారా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రస్తుతం కేసీఆర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. వారంతా తెలంగాణ సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ కు వెంట వెంటనే అపాయింట్ మెంట్స్ ఇస్తున్నారు. అదే పదవి లేకుంటే ఇంత సులువుగా అపాయింట్‌మెంట్లు లభిస్తాయా అనేది సందేహమే. ప్రస్తుతం టీఆర్ఎస్ లోనూ కేసీఆర్ కు ఉన్నతమైన గౌరవం ఉందంటే.. దానికి సీఎం హోదానే కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేజేతులా కేసీఆర్ తన పదవిని కాదనుకుంటారా? అనేది తేలాల్సిన విషయం. Also Read - పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. వైద్యశాఖ హెచ్చరిక గవర్నర్ దర్బార్ నుండి ప్రజల దృష్టి మళ్లించడానికేనా? రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వినడానికి గవర్నర్ తమిళిసై శుక్రవారం రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను బాధితులు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారితో ముచ్చటించిన గవర్నర్ మీ అందరి కోసం తాను ఉన్నానంటూ అభయ హస్తం ఇచ్చారు. ఈ ప్రోగ్రాంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహిళల సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని బాధితులంతా గవర్నర్ ను ఆశ్రయిస్తుండటమే నిదర్శనమనే మాటలు వినిపించాయి. అయితే గవర్నర్ వైఖరిని తప్పుపట్టిన టీఆర్ఎస్.. ఆమె చర్యలు ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయనే ఆలోచనకి వచ్చిందట. అందువల్లే స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి మహిళా దర్బార్ టాపిక్ నుండి మీడియా, ప్రజల దృష్టిని మళ్లించడానికి మరోసారి జాతీయ రాజకీయాలపై చర్చకు తెరలేపారనే టాక్ వినిపిస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడిన కేసీఆర్.. ఆ తర్వాత సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. ఓ వైపు రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడగా.. ఆ అంశాన్ని లైట్ తీసుకోవాలని చెబుతూనే జాతీయ పార్టీ ప్రస్తావన తీసుకురావడం వెనుక ఇదే అసలైన రీజన్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను కన్ఫ్యూజన్ లోకి పడేసే కేసీఆర్ తాజా ఆలోచన, పరిణామాలు ఎలాంటి సెన్సేషన్ కు కారణమవుతాయో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.

https://www.dishadaily.com/telangana/kcr-good-bye-to-cm-post-132834

Friday, June 10, 2022

KTR ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దు.....!

*KTR ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దు.....!*

*బండి సంజయ్‌ను ఆదేశించిన రెండో అదనపు న్యాయస్థానం*

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ను సిటీ సివిల్‌కోర్టు రెండో అదనపు న్యాయస్థానం చీఫ్‌ జడ్జి ప్రభాకర్‌రావు శుక్రవారం ఆదేశించారు.కేటీఆర్‌ను కించపరిచేలా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో, పబ్లిక్‌ లేదా ప్రైవేటు వేదికలు, సామాజిక మాధ్యమాలు, సమావేశాలు, ముఖాముఖిల్లో మాట్లాడటం కాని, ప్రచురించడం కాని చేయొద్దంటూ బండి సంజయ్‌తో పాటు ఆయన అనుచరులను ఆదేశించారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశంలో మే 11న ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్‌ ఆరోపణలు చేయగా.. ఆధారాలు చూపించాలని.. 48 గంటల్లో స్పందించకపోతే పరువునష్టం దావా వేస్తానని మంత్రి హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో మే 13న మంత్రి కేటీఆర్‌ తరఫున ఆయన న్యాయవాది బండి సంజయ్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశంలో దురుద్దేశపూర్వకంగా తన క్లయింట్‌ పేరు ఆపాదించే ప్రయత్నం చేశారంటూ కేటీఆర్‌ తరఫు న్యాయవాది మోహిత్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఈ అంశంపై విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలంటూ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది.

link Media ప్రజల పక్షం🖋️ 

ఎదురు చెప్పే వాళ్ళను నేను పట్టించుకోను.... నన్ను ఎవరూ అడ్డుకోలేరు.... గవర్నర్ తమిళ సై

*ఎదురు చెప్పే వాళ్ళను నేను పట్టించుకోను.... నన్ను ఎవరూ అడ్డుకోలేరు.... గవర్నర్ తమిళ సై*

హైదరాబాద్: తెలంగాణ మహిళలు ఇబ్బందులు పడుతుంటే తాను చూస్తూ ఊరుకోనని.. వారి కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు.వారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ఒక బలమైన శక్తిగా ముందుంటానని చెప్పారు. తమిళిసై ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా దర్బార్‌లో భాగంగా మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేజ్ మీద ఓ వృద్ధురాలిని కూర్చోబెట్టుకుని మహిళల సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా దర్బార్‌కు వచ్చిన మహిళలను ఉద్దేశిస్తూ తమిళిసై తెలుగులో ప్రసంగించడం విశేషం.

''గవర్నర్ ప్రజలను కలుస్తారా? అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ప్రజల కోసమే అని గుర్తుంచుకోవాలి. సెక్యూరిటీ వాళ్లు వద్దన్నా కొవిడ్ సమయంలో రోగులను పరమర్శించాను. మహిళలు సమాజంలో ఎక్కువగా బాధింపబడుతున్నారు. ఒక మహిళగా బాధిత మహిళలకు అండగా ఉండి, ఆదరించాలని ఆశిస్తున్నాను. నా తెలంగాణ మహిళలకు తోడుగా ఉండాలని అనుకుంటున్నాను. మహిళలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాను. ఈ విషయంలో ఎదురు చెప్పే వాళ్లను నేను పట్టించుకోను. నిరసనకారుల గురించి నేను ఆందోళన పడటం లేదు. తెలంగాణ మహిళలు సురక్షితంగా ఉండాలి. ఒక సోదరిలా తెలంగాణ మహిళల వెన్నంటి ఉంటాను. నన్ను ఎవరూ అడ్డుకోలేరు. బాధితుల స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తాను. వాటికి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. విధానం ఏదైనా ప్రజల కోసమే పని చేయాలి. వినిపించని మహిళల స్వరం కూడా వినిపించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఇలాంటి మద్దతు చాలా అవసరం. మనం గెలుస్తాం.. మన గెలుపును ఎవరూ ఆపలేరు'' అని మహిళలకు గవర్నర్‌ భరోసా ఇచ్చారు.
*ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు....*
24 గంటల క్రితమే మహిళలను కలవాలని నిర్ణయం తీసుకున్నాను. మంచి స్పందన వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముందుగా మహిళా దర్బార్ నిర్వహించాను. మహిళలకు అండగా ఉండాలనే మహిళా దర్బార్ నిర్వహించాను. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. కొందరు రాజ్‌భవన్‌లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ప్రశ్నిస్తున్నారు. రాజ్‌భవన్‌కు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఉంది. ఇది పొలిటికల్ కార్యాలయం కాదు.. నేను చేయదగిన కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నా. మహిళా దర్బార్‌ను భవిష్యత్తులోనూ కొనసాగిస్తాను. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల కోసమే ఉన్నాయి. రాజ్‌భవన్‌ను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ప్రభుత్వానికి పంపిస్తాను. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నా. జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. ఎన్నికైన ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తాను. ప్రభుత్వం కూడా అలాగే స్పందించాలి. ప్రభుత్వం ప్రొటోకాల్ సరిగా పాటించడం లేదు. అది నన్ను ఆపలేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో పని చేస్తున్నా'' అని గవర్నర్‌ పేర్కొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Thursday, June 9, 2022

కోర్టు దిక్కరణ కేసులో నలుగురు పోలీస్ అధికారులకు..... ఊరట.....!

*కోర్టు దిక్కరణ కేసులో నలుగురు పోలీస్ అధికారులకు..... ఊరట.....!*

హైదరాబాద్‌: కేసుల దర్యాప్తులో సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించినందున నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల జైలు శిక్ష, రూ.రెండు వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైదరాబాద్‌ జాయింట్‌ సీపీ (అప్పటి వెస్ట్‌జోన్‌ డీసీపీ) ఎ.ఆర్‌.శ్రీనివాస్‌, బంజారాహిల్స్‌ ఏసీపీ ఎం.సుదర్శన్‌, జూబ్లీహిల్స్‌ సీఐ ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సీహెచ్‌.నరేష్‌లు సీజే ధర్మాసనం ఎదుట అప్పీల్‌ చేశారు. సింగిల్‌ జడ్జి విధించిన జైలుశిక్షపై సీజే ధర్మాసనం స్టే ఇచ్చింది. విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

link Media ప్రజల పక్షం🖋️