Friday, January 28, 2022

Land buyers ‘misguided’ by officials seek justice

Land buyers ‘misguided’ by officials seek justice

Several middle-class and upper middle-class people, who had invested their lifetime savings in lands to meet the educational or marriage expenses of their children, or to have a secure retired life in their old age, are finding themselves in the lurch now.

M.G. Rao, A. Ravinder Reddy and some others purchased about 80 acres of land at Ameenpur (survey No. 343 in 2005/06). The land, allotted to some freedom fighters, was allegedly sold to these persons after they met former MLA T. Jayaprakash Reddy, a Registration Department official Veerender and a government employee M. Rajender though middlemen. Before proceeding to pay the amount, the buyers had checked the records with the Revenue officials and on June 25, 2005, the then Mandal Revenue Officer of Patancheru issued an endorsement letter.

“The following two freedom fighters: Bollu Bhahraiah and S. Devaiah, who were allotted government land in survey No. 343/1 situated at Ameenpur village of Patancheru mandal were granted pattas under GO Ms No. 1743 of Revenue Department dated 28-08-1958 and GO Ms. No 1110 of Revenue Department dated 26-06-1960. Hence the land allotted is alienable,” was the endorsement certificate issued by the MRO of Patancheru. On getting this certificate, they approached the concerned department at the Collectorate and made a second enquiry on whether these lands could be purchased. The buyers are claiming that the officials informed them there will no problem in purchasing the land.

“We paid about ₹ 40 crore to Mr. Jayaprakash Reddy, Mr. Veerender and Mr. Rajender and got the land registered. When we tried to start work on the land, they asked us to stop work stating that there were some problems that were need to be sorted out and assured us that they would address them. Finally, the revenue officials are stating that the land registration is not tenable in the court of law and we are no longer owners of the land. We had lost heavily, please do us justice,” asked Mr. Ravinder Reddy and Mr. Rao.

In a related development, one Veeresham of Shankarapally village in Ranga Reddy district has alleged that about 200 acres of land at Eedulanagulapally village was purchased by MLA T Jayaprakash Reddy and others. A sale deed was signed, but cheques issued by Mr Jayaprakash Reddy were not honoured and a case was pending at the court.

https://youtu.be/IjgXK1jT6Qs


ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది తెలంగాణ గౌరవనీయులైన @TelanganaCMO కేసీఆర్ సారు గారిని

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*తెలంగాణ గౌరవనీయులైన @TelanganaCMO కేసీఆర్ సారు గారు వార్త కథనం(దిశ మీడియా)ప్రకారం మీరు మీ నాయకులను మొదట చట్టప్రకారం అరెస్టు చేయండి అప్పుడు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్ముతారు లేకపోతే మీరు చెప్పేటివన్నీ డైలాగులు అనుకుంటారు. గతంలో అకున్ సభర్వాల్ సారు డ్రగ్స్ మీద ఇచ్చిన నివేదికను సోషల్ మీడియా కు ఇవ్వండి మీ విశ్వశనీయత తెలుస్తుంది. ఏది ఏమైనా యువత భవిష్యత్ నాశనం చేస్తున్న ఈ డ్రగ్స్ మాఫియాను కూకటివేళ్ళతో పెకిలించాలంటే సమాజం మొత్తం సహకరించాలి. సమాజమా మీ మౌనం మీ కుటుంబంలో కానీ మీ బంధువుల కుటుంబంలోని యువత భవిష్యత్ నాశనానికి కారణం అవుతారు బాగా ఆలోచించండి 🙏.... Bplkm*

*Copy to Group link Media*
*Note : ఉడుతా పంజాబ్ లా ఉడుతా తెలంగాణ సినిమా తీయొచ్చు* 29/01/2022

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/

https://twitter.com/Praja_Snklpm/status/1487286011222982661?t=oqJxEwiuqWZNSpsOegPBHw&s=08

హైదరా‘బాదుడే’భారీగా పెరగనున్న మార్కెట్‌ విలువలుస్థలాల ధరల్లో 35% నుంచి 45%

హైదరా‘బాదుడే’

భారీగా పెరగనున్న మార్కెట్‌ విలువలు

స్థలాల ధరల్లో 35% నుంచి 45%

నేటి సాయంత్రంలోగా జిల్లా కమిటీల ఆమోదం

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి

Courtesy by : ఈనాడు - హైదరాబాద్‌ ట్విట్టర్ 

Telangana News: హైదరా‘బాదుడే’

రాజధాని హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్ల మార్కెట్‌ విలువలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ శుక్రవారం తుది ప్రతిపాదనలను రూపొందించింది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు అత్యధిక రాబడిని అందించే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో భూములు విలువలు, అపార్ట్‌మెంట్‌ల ధరలు భారీగా పెరిగాయి. కొత్త మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గత ఏడాది జులై 22న మార్కెట్‌ విలువలను సవరించగా తాజాగా మరోసారి పెంచారు. శుక్రవారం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి  జిల్లా రిజిస్ట్రార్‌లతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి ప్రత్యేకంగా సమావేశమై పెరిగిన మార్కెట్‌ విలువలపై తుది పరిశీలన చేసి ఖరారు చేశారు.

కొత్త మార్కెట్‌ విలువులను కమిటీలు శనివారం సాయంత్రంలోపు ఆమోదించేలా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

600 గ్రామాలపై ప్రత్యేక దృష్టి

పట్టణీకరణ, జాతీయ రహదారులకు ఇరువైపులా, మౌలిక వసతులు బాగా పెరిగిన ప్రాంతాల్లో మార్కెట్‌ విలువల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ జోరుతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న 600కు పైగా గ్రామాలను గుర్తించి అక్కడ మార్కెట్‌ విలువల పెంపును ప్రత్యేకంగా పరిగణించారు. 

* రంగారెడ్డి జిల్లా పరిధిలో చదరపు గజం ధర గరిష్ఠంగా రూ.45,500 నుంచి రూ.61,500కు పెరిగింది. రియల్‌ ఎస్టేట్‌కు కీలకంగా ఉండే ప్రాంతాల్లో పెరుగుదల భారీగా ఉంది. హైదరాబాద్‌ చుట్టు పక్కల ఖాళీ స్థలాల ధరల్లో కనీస పెరుగుదల 35 శాతం ఉండగా క్రయ విక్రయాలు భారీగా జరిగే ప్రాంతాల్లో 40 శాతం... అత్యధిక కొనుగోలు, అమ్మకాలు జరిగే చోట ఇది 45 శాతం కూడా ఉంది. 

* ఎకరం రూ.5 కోట్ల విలువ కలిగిన వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ 50 శాతం పెరగ్గా, రూ.5- 10 కోట్ల మధ్య ఉన్న వాటి ధరలు 20 శాతం హెచ్చినట్లు తెలిసింది.



Telangana News: హైదరా‘బాదుడే’

తహసీల్దార్​ మాయాజాలం.. బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు.. ఆ తర్వాత

ERTIFICATE IN WANAPARTHY DISTRICT

    తహసీల్దార్​ మాయాజాలం.. బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు.. ఆ తర్వాత

    Courtesy by : ఈtv భారత్ మీడియా ట్విట్టర్ 

    Thumbnail image

    ప్రజలు కట్టే పన్నులను జీతాలుగా తీసుకుంటూ వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే.. అన్యాయం చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలకు లోబడి.. డబ్బుకు ఆశపడి వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. ఫలితంగా అసలైన లబ్ధిదారులను బతికుండగానే రికార్డుల్లో చంపేస్తూ వారి భూమిని ఇతరుల పేరు మీదకు పట్టా చేస్తున్నారు. వృత్తి ధర్మాన్ని మరిచి కాసులకు కక్కుర్తి పడి సామాన్యుల ఉసురుపోసుకుంటున్నారు. ఒకే జిల్లాలో ఒకరే తహసీల్దారు.. ఇద్దరు రైతులు బతికుండగానే వారు చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన ఘటనే అందుకు దృష్టాంతం.

    బతికి ఉన్న ఓ రైతు మరణించినట్లుగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అతని పేరు మీద ఉన్న 16 గుంటల పొలాన్ని ఓ వ్యక్తికి అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్​ కాగితాలు మార్చేశాడు ఓ తహసీల్దారు. కంగు తిన్న బాధితుడు ఆరేళ్లుగా న్యాయం పోరాటం చేస్తున్నారు. మరో కేసులో అదే తహసీల్దారు.. మరో రైతును రికార్డుల్లో చంపేసి ఏకంగా 12 ఎకరాల 30 గుంటల భూమిని పట్టా మార్పిడి చేశాడు. న్యాయం పోరాటం చేస్తున్న ఆ రైతు ఇటీవల మరణించారు. వనపర్తి జిల్లాలో ప్రస్తుత మిడ్జిల్​ తహసీల్దార్ శ్రీనివాసులు.. రెండు చోట్ల విధులు నిర్వర్తించగా ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన విషయాలివి. అధికారులతో మొరపెట్టుకున్నా ఫలితం లేదని తెలుసుకున్న రైతు, మరో రైతు కుమారుడు.. హైదరాబాద్​లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు.

    తమకు న్యాయం చేయాలంటూ కమిషన్‌కు బాధితుల విజ్ఞప్తి

    "నేను బతికుండగానే చనిపోయినట్లు తహసీల్దార్​ శ్రీనివాసులు రికార్డులు సృష్టించారు. రాజకీయ నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతోంది. పోలీసు వ్యవస్థ కూడా సహకరించడం లేదు. నాకున్న 16 గుంటల భూమిని ఇతరులకు అమ్మినట్లు రిజిస్ట్రేషన్​ చేశారు." - కుక్కన్న, బాధిత రైతు

    మరో కేసులో తహసీల్దార్​ శ్రీనివాసులుపై మరో వ్యక్తి ఫిర్యాదు చేశాడు. 2019లో వనపర్తి జిల్లా విపునగండ్ల తహసీల్దార్​గా పని చేసిన శ్రీనివాసులు.. తన తండ్రి శివన్న గౌడ్​ బతికుండగానే మరణించినట్లు రికార్డులు సృష్టించి.. తమ 12 ఎకరాల 30 గుంటల భూమిని పట్టా మార్పిడి చేశారని బాధితుడు శ్రీనివాస్ గౌడ్... కమిషన్​కు తెలిపాడు. అధికార పార్టీకి చెందిన స్థానిక మంత్రి అనుచరులకు తమ భూమిని వారి పేర్లపై రికార్డుల్లో ఎక్కించారని పేర్కొన్నాడు. ఈ విషయంపై హైకోర్టులో స్టే ఆర్డర్ తీసుకొచ్చినా తహసీల్దార్​.. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పట్టా మార్పిడి చేశారని ఫిర్యాదులో వివరించాడు. న్యాయ పోరాటం చేస్తున్న తన తండ్రి శివన్న గౌడ్ ఇటీవల మరణించారని... డబ్బులకు అమ్ముడుబోయి తమ భూమిని ఇతరులకు ధారాదత్తం చేసిన తహసీల్దార్​ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని ఆయన కమిషన్​ను కోరాడు.

    "గతంలో మా తండ్రి శివన్న గౌడ్​ చనిపోయినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించి ఆయన పేరు మీదున్న 12 ఎకరాల 30 గుంటల భూమిని ఓ సామాజిక వర్గానికి చెందిన వారి పేరు మీద పట్టా చేశారు. దీనిపై మేము హై కోర్టు నుంచి స్టే ఆర్డర్​ కూడా తీసుకొచ్చాం. అయినా తహసీల్దార్​ శ్రీనివాసులు వాటిని బేఖాతరు చేశారు. మా తండ్రి ఇటీవల చనిపోయారు. మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించాం." - శ్రీనివాస్​ గౌడ్​, బాధిత రైతు

డ్రగ్స్ వాడకంపై పోరాటాన్ని సామాజిక ఉద్యమంగా మలచాలి అప్పుడే డ్రగ్స్ అరికట్టడం జరుగుతుంది... సీఎం కేసీఆర్

Courtesy by : @TelanganaCMO Twitter 

పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు వినూత్నరీతిలో ఆలోచించి ప్రతి ఒక్కరి సహకారంతో దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకంపై పోరాటాన్ని సామాజిక ఉద్యమంగా మలచిననాడే తెలంగాణ నుంచి ఈ సమస్యను సమూలంగా నిర్మూలించడం సాధ్యమవుతుందని సీఎం శ్రీ కేసీఆర్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ అధికారుల సదస్సు’ జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతున్నదని సీఎం అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం తెలిపారు.

ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని, 1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు.

ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను, వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా, తేజోవంతంగా పనిచేయాలన్నారు.

అద్భుత పనితీరు కనబరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు ఆక్సెలరేటెడ్ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం స్పష్టం చేశారు.

డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్తులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

డ్రగ్స్ సమాజానికి పట్టిన పీడ... సామజిక బాధ్యతతోనే సాధ్యం...సీఎం కేసీఆర్

Courtesy by : link Media ప్రజల పక్షం 

దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలని, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతున్నదని సీఎం అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం తెలిపారు. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం అన్నారు.

1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని  అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు  కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు రివార్డులు ఆక్సెలరేషన్ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందనీ సీఎం స్పష్టం చేశారు.

డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ అధికారుల సదస్సు’ జరిగింది.

ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ చామకూర మల్లారెడ్డి, ఎంపీలు శ్రీ బీబీ పాటిల్, శ్రీమతి కవితా నాయక్, ఎమ్మెల్యేలు శ్రీ బాల్క సుమన్, శ్రీ రెడ్యానాయక్, శ్రీ రవీంద్ర కుమార్ నాయక్, శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ రాజేందర్ రెడ్డి, శ్రీ సుంకే రవిశంకర్, శ్రీ కృష్ణ మోహన్ రెడ్డి, శ్రీ గాదరి కిశోర్ కుమార్, శ్రీ సాయన్న, శ్రీమతి రేఖా నాయక్, శ్రీ అబ్రహం, శ్రీ హన్మంతు షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ శ్రీ అనురాగ్ శర్మ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సి.వి. ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేశ్ భగవత్, సీఎంఓ అధికారులు శ్రీ నర్సింగ రావు, శ్రీ భూపాల్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రవి గుప్తా, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్లు, డీసీలు, పోలీస్ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, ఎస్పీలు, కమిషనర్లు, డీసీలు తదితరులు పాల్గొన్నారు.

70 వేల కోట్ల “మెగా” గుట్టు ఏంటి?

70 వేల కోట్ల “మెగా” గుట్టు ఏంటి?

– మెఘా ఇంజనీరింగ్ కు బిగుస్తున్న ఉచ్చు
– ఐటి దాడుల్లో బోగస్ ఇన్వాయిస్ లు
– పెద్ద ఎత్తున దొంగ లెక్కలు
– తెర పైకి 12 వేల కోట్ల జీఎస్టీ ఎగవేత కేసు
– నగదు లావాదేవీల్లో 70 వేల కోట్లు ?
– గోల్ మాల్ గుట్టు రట్టు చేయనున్న తొలివెలుగు

సరిగ్గా ఏడాదిన్నర క్రితం..ఏకంగా 2000 కోట్ల రూపాయల వరకూ నగదు స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ అధికారులు లీకులు ఇచ్చారు.ఆ తరువాత 2 రోజుల్లోనే లెక్కలు క్లోజ్ అయ్యాయి.అందుకు బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.తర్వాత ఈ కేసు ఏమైందో ఎవరికి తెలియదు.ఇప్పుడు మరోసారి మేఘా ఇంజనీరింగ్,ఐఏఎస్ కూతురి పెళ్లి బిల్లుల చెల్లింపు విషయం వెలుగులోకి వచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులు అయినా.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల్లో భారీగా లాభాలు ఉండే చిన్న చితక పనులు ఐనా..మేఘనే చేస్తుంది. ఏదైనా సరే మేఘా తెలంగాణ ప్రభుత్వం జేబు కంపెనీ అని అందరికి తెలిసిందే.

కంపెనీ వద్దనుకుంటే తప్పా తెలంగాణలో అన్నిపనులు మెగా కనుసన్నులోనే జరుగుతున్నాయి.దీనివెనుక 70వేల కోట్ల నల్లధనం దాగి ఉందని సమాచారం.ఒక్క షెల్ కంపెనీ తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె పెళ్ళికి 50 లక్షల పైనే ఖర్చు పెట్టిందంటే..మళ్ళీ ప్రభుత్వం రావడానికి టీఆర్ఎస్ కి ఎంత ఫండ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఓ వృద్ధురాలి ఇంటి పై ఆమెకు తెలియకుండానే కంపెనీ ఏర్పాటు చేసి దందా చేస్తున్నారు. అంటే..ఇంకా ఇలాంటి సూటు కేస్ కంపెనీల వ్యవహారం బయటపడాల్సిన అవసరం ఉంది.దీనికి సంబంధించి తొలివెలుగు క్రైమ్ బ్యూరో త్వరలోనే ఇన్వెస్టిగేషన్ కథనాలు రాయబోతోంది. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన హోటల్ లో జరిగిన విందు,వైభోగాల ఖర్చు కోసం ఏకంగా షెల్ కంపెనీలను ఉపయోగించింది మేఘా. అయితే దీనిపై మేఘాతోపాటు రజత్ కుమార్ లు కూడా ఖండనలు ఇచ్చారు.



మేఘా కంపెనీ వివరణ ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు.అదేంటి అంటే కంపెనీ ఉద్యోగులు చేసిన లావాదేవీలతో తమకేమీ సంబంధం అనీ, అయితే ఉద్యోగులు ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లి ఖర్చుకు ఏకంగా 20 నుంచి 25 లక్షలు ఖర్చు పెడతారా? పెడితే గిడితే మేఘాలో ఓ ఉన్నతాధికారికి ఖర్చుపెట్టి ఏమైనా ప్రమోషన్..లేదా వేతనాల ప్రయోజనం పొందుదామనుకుంటాడు.కానీ ప్రభుత్వంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి సొంత నిధులు అంత మొత్తంలో ఎలా ఖర్చు పెడతారు?అసలు ఆ అవసరం ఏ ఉద్యోగికి అయినా ఏమి ఉంటుంది. మెగా ఇంజనీరింగ్ వివరణ అసలు నమ్మశక్యంగా ఉందా?అంటే దొరికిన తర్వాత ఉద్యోగుల పేరు చెప్పి తప్పించుకుంటున్నారనే విషయం స్పష్టం అవుతోంది.అంతే కాదు..ఉద్యోగుల వ్యక్తిగత విషయాలు కంపెనీకి ఏమి సంబంధం అంటూ ప్రశ్నలు వేస్తోంది.

ఇదిలా ఉంటే రజత్ కుమార్ కూడా ఖండిస్తూ బిల్లులు అన్నీ తానే చెల్లించానని చెబుతున్నారు.ఆయన చెప్పిందే నిజం అయితే ఈ మొత్తం బిల్లుల వ్యవహారం తన ఐటి వార్షిక రిటర్న్స్ లో చూపిస్తారా?ఓ ఐఏఎస్ అధికారి హోటల్ గదులు,ఫైవ్ స్టార్ ఆతిధ్యం కోసం ఖరీదైన ప్రాంతం బుకింగ్ కోసం అధికారికంగా 25 లక్షల ఖర్చు పెట్టడం జరిగే పనేనా?అయితే ఇది ఒక్కటే వెలుగులోకి వచ్చింది. ఇలా వెలుగులోకి రాకుండా జరిగే వ్యవహారాలు ఎన్నో. ఐఏఎస్ అధికారుల కుటుంబ సభ్యుల పెళ్లిళ్ళే కాదు బీహార్ తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఐఏఎస్ లు కట్టుకునే ఇళ్లు కూడా బడా బడా నిర్మాణ కంపెనీలే కట్టించిపెడుతున్నాయి. వీటికి కూడా షెల్ కంపెనీలను వాడటమో లేక ఇతర మార్గాల్లోనే పనులు కానిచ్చేస్తున్నారు. అంతే కాదు ఐఏఎస్ లు కోరుకునే అన్ని విలాసాలను కూడా పలు కంపెనీలు సమకూరుస్తున్నాయి. ఈ విషయం కాంట్రాక్ట్ సర్కిల్స్ తోపాటు ఐఏఎస్ వర్గాలు అందరికీ తెలిసినవే.తొలివెలుగు ఫినిక్స్ లాంటి కార్పొరేట్ కంపెనీల బాగోతాన్ని, బినామిలా వ్యవహారం బట్టబయలు చేసింది. అలాగే తొలి వెలుగు మెగా పై కూడా పరిశోధనాత్మక కధనాలను ప్రజల ముందు అతి త్వరలో ఉంచనుంది.