Thursday, September 16, 2021

స‌జ్జ‌నార్ ఇష్యూతోనే ఆత్మ‌హ‌త్య‌గా మార్చారా…?

హైదరాబాద్ : 16/09/2021

స‌జ్జ‌నార్ ఇష్యూతోనే ఆత్మ‌హ‌త్య‌గా మార్చారా…?

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!


గ‌తంలో హైద‌రాబాద్ న‌గ‌రంలోనే దిశ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌లో నిందితులంతా ఎన్ కౌంట‌ర్ అయ్యారు. ఆ ఎన్ కౌంట‌ర్ వెనుక ఉంది సీపీ స‌జ్జ‌నార్ అనేది అంద‌రికీ తెలుసు. గ‌తంలో వ‌రంగ‌ల్ లో జ‌రిగిన‌ యాసిడ్ దాడి స‌మ‌యంలోనూ నిందితుడు ఎన్ కౌంట‌ర్ అయ్యాడు. దీంతో ఇలాంటి కేసుల్లో స‌జ్జ‌నార్ అంటే ఓ సెన్సేష‌న్.

అయితే, దిశ ఘ‌ట‌న‌లో ఎన్ కౌంట‌ర్ పై సుప్రీం కోర్టు జ్యూడిషియ‌ల్ క‌మిటీ విచార‌ణ చేస్తుంది. వారు పోలీసులను, కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. కావాల‌నే పోలీసులు త‌మ బిడ్డ‌ల‌ను చంపార‌న్న‌ది దిశ నిందితుల కుటుంబాల వాద‌న‌. ఇందులో విచార‌ణ జ‌రుగుతుండ‌టంతో… ఆ ఇష్యూ ఎక్క‌డి వ‌ర‌కు వెళ్తుందో అన్న అనుమానాలు పోలీస్ వ‌ర్గాల్లోనూ ఉన్నాయి.

అయితే, సైదాబాద్ బాలిక కేసులో ఎన్ కౌంట‌ర్ చేయాల‌న్న డిమాండ్ వినిపించినా… దిశ ఎఫెక్ట్ తో ఎన్ కౌంట‌ర్ చేయ‌రు అన్న వాద‌న కూడా తెర‌పైకి వ‌చ్చింది. అయితే, అదే స‌మ‌యంలో సూసైడ్ గా చిత్రీక‌రిస్తార‌ని ప‌లువురు సందేహించారు. తాజాగా ఇదే అంశాన్ని పీఓడబ్ల్యూ నేత సంధ్య కూడా ప్ర‌స్తావించారు. ఇది పోలీస్ హ‌త్య‌గా ప్ర‌క‌టించారు. ఆత్మ‌హ‌త్య‌గా చూపిస్తార‌ని తాము ముందు నుండి అనుకుంటున్నామ‌ని, పోలీసుల అదుపులోనే ఉన్నాడ‌ని మొద‌ట చెప్పి… ఇప్పుడు సూసైడ్ అంటున్నార‌న్నారు.

tolivelugu app download

No comments:

Post a Comment