Sunday, February 26, 2023
మన్నించు తల్లీ..😔
వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.... ఈటల రాజేందర్.....!
తెలంగాణలో టీడీపీ ని ప్రతిఒక్కరు గుండెల్లో.... పెట్టుకున్నారు.... చంద్రబాబు....!
*తెలంగాణలో టీడీపీ ని ప్రతిఒక్కరు గుండెల్లో.... పెట్టుకున్నారు.... చంద్రబాబు....!*
హైదరాబాద్: ఎన్టీఆర్ భవన్ కు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఇవాళ్టి నుంచి తెలంగాణ లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం 'ఇంటింటికీ తెలుగుదేశం' కిట్లను చంద్రబాబు పంపిణీ చేశారు.సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ''41 ఏళ్లుగా తెలుగువారి కోసమే పనిచేస్తోన్న పార్టీ టీడీపీ. తెలంగాణలో ప్రతిఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారు. తెలంగాణ గడ్డపైనే ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారు. యువత, మహిళలకు టీడీపీ మాత్రమే పెద్దపీట వేసింది. సమిష్టిగా కృషిచేసి టి.టీడీపీకి పూర్వవైభవం తేవాలి. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టీడీపీ. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ను ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదే. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్లో మౌళిక వసతులు సైబరాబాద్ను నిర్మించిన ఘనత టీడీపీదే. కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) నేతృత్వంలో పార్టీ బలోపేతం'' అవుతోందని చంద్రబాబు అన్నారు.
''సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం,..అభివృద్ధి చేయడమే టీడీపీ ధ్యేయం. సంపద సృష్టించడమెంత ముఖ్యమో, పేదలకు అందించడం అంతే ముఖ్యం. టీడీపీ ఎక్కడ ఉంది అనేవారికి ఖమ్మం సభే సమాధానం. ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడ ఉందో కనిపిస్తోంది. తెలుగువారు ఎక్కడున్నా వారికోసం టీడీపీ పనిచేస్తుంది. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుంది. కాసాని నేతృత్వంలో టి.టీడీపీ పరుగులు పెడుతోంది. తెలంగాణలో మొదటి సీటు నాయిబ్రాహ్మణులకు..రెండో సీటు రజకులకు ఇస్తాం. టి.టీడీపీకి యువత అండగా ఉండాలి. విభజన తర్వాత లేనిపోని సమస్యలు పెట్టుకోవటం సరికాదు. తెలంగాణలో సంపద సృష్టించడానికి కారణం టీడీపీనే..పేదలను నాయకులుగా ప్రమోట్ చేసిన పార్టీ టీడీపీ మాత్రమే. ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే పార్టీ గౌరవిస్తోంది. ఎన్టీఆర్ భవన్ చుట్టూ కాకుండా.. నేతలు గ్రామాల్లో తిరగాలి టీడీపీని కాపాడుకోవడం చారిత్రక'' అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Saturday, February 25, 2023
తెలంగాణలో రేపటి నుండి ఇంటింటికి.... తెలుగుదేశం..... కాసాని జ్ఞానేశ్వర్
*తెలంగాణలో రేపటి నుండి ఇంటింటికి.... తెలుగుదేశం..... కాసాని జ్ఞానేశ్వర్*
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పూర్వవైభవం దిశగా అడుగులు పడుతున్న వేళ యువత, మహిళలు, విద్యావంతులకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.రాష్ట్రంలో రేపట్నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మొదలవుతుందని ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రకటించారు. హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని తన నివాసంలో మీడియాతో కాసాని చిట్చాట్ నిర్వహించారు.
రాష్ట్రంలో పది రోజులపాటు మండలం యూనిట్గా ప్రతి బూత్ స్థాయిలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమం ఉంటుందని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో డివిజన్ల వారీగా కొనసాగుతుందని చెప్పారు. అదే ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకుంటూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపడతామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్లలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో భాగంగా నాడు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కిలో రూ.2 బియ్యం పథకం, పట్వారీ, పటేల్ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తి హక్కు, బీసీ వర్గాలకు పెద్దపీట వంటి అంశాలు వివరించడంతోపాటు తెదేపా పూర్వ వైభవం కోసం సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. పది రోజుల తర్వాత మరో 20 రోజులపాటు ప్రతి మండలంలో అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపడతామని తెలిపారు. తెదేపా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మార్చి 27వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 'సింహగర్జన' పేరిట లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని... ఆ సభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరవుతారని కాసాని వెల్లడించారు.
*సుజీవన్ వావిలాల*🖋️
సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేగంగా పాలమూరు - రంగారెడ్డి.... MP రంజిత్ రెడ్డి....!
*సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేగంగా పాలమూరు - రంగారెడ్డి.... MP రంజిత్ రెడ్డి....!*
సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తవుతాయని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.ఎత్తిపోతల పథకం పనులు ఎలా జరుగుతున్న తీరును శనివారం నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రాజెక్టు పనుల్లో మొదటి భాగమైన శ్రీశైలం బ్యాక్వాటర్ ప్రాంతమైన నాగర్ కర్నూల్లోని అంజనగిరి రిజర్వాయర్ మొదలుకొని ఉద్దండపూర్ రిజర్వాయర్ వరకు జరుగుతున్న కెనాల్, టన్నెల్, సర్జ్పూల్, పంపుహౌస్ పనులను అక్కడి పనిచేస్తున్న ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేక వాహనాల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల ప్రాజెక్టు సందర్శనకు తీసుకుకెళ్లే ఏర్పాట్లను చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రకటించారు
*సుజీవన్ వావిలాల🖋️*
Friday, February 24, 2023
కేసులుంటే స్వీపర్ కాలేరు కానీ మంత్రలు కావొచ్చు.... సుప్రీం కోర్ట్
యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!
*యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!*
హైదరాబాద్: రోడ్డుపై కుప్పకూలి పడిపోయిన ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ కు అభినందనలు వెల్లువెత్తున్నాయి.యువకుడిని కానిస్టేబుల్ రక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శభాష్.. రాజశేఖర్ అంటూ నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఇటు కానిస్టేబుల్ సమయస్ఫూర్తిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందలు తెలియజేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అభినందించి రివార్డు అందజేశారు. రాజశేఖర్ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్ శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసనాయుడు రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి అభినందించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలపై రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.
*సుజీవన్ వావిలాల*🖋️