Sunday, February 26, 2023

తెలంగాణలో టీడీపీ ని ప్రతిఒక్కరు గుండెల్లో.... పెట్టుకున్నారు.... చంద్రబాబు....!

*తెలంగాణలో టీడీపీ ని ప్రతిఒక్కరు గుండెల్లో.... పెట్టుకున్నారు.... చంద్రబాబు....!*

హైదరాబాద్: ఎన్టీఆర్ భవన్‌ కు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఇవాళ్టి నుంచి తెలంగాణ లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం 'ఇంటింటికీ తెలుగుదేశం' కిట్లను చంద్రబాబు పంపిణీ చేశారు.సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ''41 ఏళ్లుగా తెలుగువారి కోసమే పనిచేస్తోన్న పార్టీ టీడీపీ. తెలంగాణలో ప్రతిఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారు. తెలంగాణ గడ్డపైనే ఎన్టీఆర్‌ టీడీపీని ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారు. యువత, మహిళలకు టీడీపీ మాత్రమే పెద్దపీట వేసింది. సమిష్టిగా కృషిచేసి టి.టీడీపీకి పూర్వవైభవం తేవాలి. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టీడీపీ. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ను ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదే. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో మౌళిక వసతులు సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత టీడీపీదే. కాసాని జ్ఞానేశ్వర్‌(Kasani Gnaneshwar) నేతృత్వంలో పార్టీ బలోపేతం'' అవుతోందని చంద్రబాబు అన్నారు.

''సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం,..అభివృద్ధి చేయడమే టీడీపీ ధ్యేయం. సంపద సృష్టించడమెంత ముఖ్యమో, పేదలకు అందించడం అంతే ముఖ్యం. టీడీపీ ఎక్కడ ఉంది అనేవారికి ఖమ్మం సభే సమాధానం. ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడ ఉందో కనిపిస్తోంది. తెలుగువారు ఎక్కడున్నా వారికోసం టీడీపీ పనిచేస్తుంది. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుంది. కాసాని నేతృత్వంలో టి.టీడీపీ పరుగులు పెడుతోంది. తెలంగాణలో మొదటి సీటు నాయిబ్రాహ్మణులకు..రెండో సీటు రజకులకు ఇస్తాం. టి.టీడీపీకి యువత అండగా ఉండాలి. విభజన తర్వాత లేనిపోని సమస్యలు పెట్టుకోవటం సరికాదు. తెలంగాణలో సంపద సృష్టించడానికి కారణం టీడీపీనే..పేదలను నాయకులుగా ప్రమోట్ చేసిన పార్టీ టీడీపీ మాత్రమే. ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే పార్టీ గౌరవిస్తోంది. ఎన్టీఆర్‌ భవన్ చుట్టూ కాకుండా.. నేతలు గ్రామాల్లో తిరగాలి టీడీపీని కాపాడుకోవడం చారిత్రక'' అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment