*పోలీస్ అవుతారా..... రాచకొండకు...... రండి*
*ఉచిత శిక్షణ కేంద్రాలకు ఏర్పాట్లు*
హైదరాబాద్: పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందాలనుకునే యువతీ, యువకులకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సారథ్యంలో శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, స్వచ్చంద సంస్థలు, దాతల సహాయంతో ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరి, కుషాయిగూడ, భువనగిరి, చౌటుప్పల్, ఎల్.బి.నగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో శిక్షణ కేంద్రాలు తెరవనున్నారు. గతంలో రాచకొండ పోలీస్ ద్వారా కోచింగ్ తీసుకొని 588మంది పోలీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 5 సాయంత్రం 6 గంటల్లోపు తమ సమీప పోలీస్ స్టేషన్లోనూ పేర్లను నమోదు చేసుకోవచ్ఛు పదోతరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, ఆధార్ కార్డు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకెళ్లాలి. పురుషులు 167.6 సెం.మీ, మహిళలు 152.5 సెం.మీ ఎత్తు ఉన్నవారు మాత్రమే పేర్లను నమోదు చేసుకోవాలి. స్థానికులకు ప్రాధాన్యం ఉంటుంది.
link Media ప్రజల పక్షం🖋️



రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ప్రతిపాదించారంటూ వస్తున్న వార్తల్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. ఉదయం నుంచి సోషల్మీడియాలోనూ, పలు మీడియా చానళ్లలోనూ ఈ వార్త హల్ చల్ చేసింది. అయితే అవన్నీ వదంతులేనని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. 2022 నాటికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. శరద్ పవార్, మాయావతి, గులాంనబీ ఆజాద్ లు రాష్ట్రపతి రేసులో ఉన్నారని మొన్నటివరకు చర్చ నడిచింది.