Saturday, January 23, 2021

జాతీయ బాలికల దినోత్సవం

హైదరాబాద్ : 24/01/2021


*@తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన గవర్నర్ మేడం గారి సందేశం.*

*మన దేశ బాలికలందరికి జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు*.
మనదేశంలో జాతీయ బాలికల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24 న జరుపుకుంటాము.దీని లక్ష్యం మనదేశ బాలికలకు మద్దతు, అవకాశాలను అందించడం, హక్కుల గురించి అవగాహన కల్పించడం, బాలిక విద్య యొక్క ప్రాముఖ్యత మరియు వారి పోషణపై అవగాహన పెంచడం.

https://prajasankalpam1.blogspot.com/

Friday, January 22, 2021

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి

హైదరాబాద్ : 23/01/2021

*జాతికే అంకితమై ఉద్యమం నడిపిన ఘనచరిత గలిగిన మహనీయులెందరెందరో*

*బ్రిటీష్ వారి గుండెల్లో సింహ స్వప్నం స్వాతంత్ర్య సమరంలోకి దూసుకెళ్లిన బోస్ గారు యువతకు చక్కని స్ఫూర్తి జైలు శిక్షలకు వెరువని త్యాగ మూర్తి*

*అనారోగ్యాన్ని అరికాలు కింద తొక్కిపెట్టి ఉద్యమ కడలిలో ఎదురీదిన ధీశాలి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటు చేసి బ్రిటీష్ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించిన సాహసం ఇతడు*

*ఆయన త్యాగనిరతి నిబద్ధత ధైర్యసాహసాలు ప్రతీ భారతీయుడిలో ఉత్తేజాన్ని రేకిస్తాయి*

*మత తత్వము రూపు మాపడమే భారతీయులు మొదటి కర్తవ్యం అని నొక్కి చెప్పిన వక్త భిన్నత్వంలో ఏకత్వం మన ఆనవాయితీ*

*దీనికి పూర్తిగా కట్టుబడిన వ్యక్తి బోస్ గారు ఉమ్మడి స్వాతంత్ర్యంలో సమైక్యత సమభావం ఉండాలనే ధ్యేయం దాస్య శృంఖాలను తెంచుటకై నడుం కట్టిన బెంగాల్ తేజం*

*శుభాస్ చంద్ర బోస్ ఒక వ్యక్తి కాదు ఉద్యమ శక్తి నేతాజీ అన్న పేరు సుభాష్ చంద్రబోస్ లోనే ఇమిడి పోయింది వెనుదిరగని ధీరత్వానికి అధిపతి*

*నేతాజీ లోని తెగువ ధైర్యం సాహసం నాయకత్వ పటిమ రక్తంలో రంగరించుకొని*

*నేటి యువతేజాలు పిడికిలి బిగించి ప్రతీ ఒక్కరు నేతాజీ ప్రతి రూపాలై ఆజాద్ హింద్ ఫౌజ్ అంటు ఉత్చాహంగా ముందుకు కదలాలి....*

*సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా ప్రజా సంకల్పం & link Media ఘన నివాళులు అర్పిస్తుంది 🙏*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Thursday, January 21, 2021

పర్యావరణ పరిరక్షణ ప్రేమికులు

హైదరాబాద్ : 22/01/2021

*Part - 1*
https://youtu.be/NRZa-RSfx5g

*Part - 2*
https://youtu.be/sXcq9ljGKvM

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, January 20, 2021

ఎల్ఆర్ఎస్ పై కఠిన చర్యలొద్దు

హైదరాబాద్ : 21/01/2021

*ఎల్ఆర్ఎస్ పై కఠిన చర్యలొద్దు.......!*
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)లో భాగంగా తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదంటూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌తోపాటు అపరాధ రుసుంతో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకం(బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం/బీపీఎస్‌)కు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ల వ్యవహారాలు ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 28కు వాయిదా వేసింది.
అక్రమ లేఔట్లు, అందులోని ప్లాట్‌లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 20న జారీ చేసిన *జీవో 131* ను సవాలు చేస్తూ *ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కప్పర ప్రసాదరావు, పి.శ్రీధర్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌ తదితరులు ప్రజాప్రయోజన పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం విదితమే*.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో కొందరు మొత్తం జీవోను సవాలు చేయగా, మరికొందరు కొన్ని నిబంధనలను సవాలు చేశారని పిటిషనర్ల తరఫు *సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి* తెలిపారు. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్‌లను 4 నెలలపాటు నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసినట్లు మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ జీవో 131 మొత్తాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపడతామని, ఇతర పిటిషనర్‌లు దీనికి అనుబంధంగా వాదనలు వినిపించాలని సూచించింది.

ఈ దశలో అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బి.ఎస్‌.ప్రసాద్‌ జోక్యం చేసుకుంటూ ఇందులో ఒక పిటిషన్‌లో మినహా మిగిలినవాటిలో కౌంటర్లు దాఖలు చేశామని తెలిపారు. అయితే ఈ వివాదం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని తెలిపారు. జువ్వాడి సాగర్‌రావు వర్సెస్‌ కేంద్రం కేసులో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలనూ ప్రతివాదులుగా చేసిందని తెలిపారు. తెలంగాణతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు క్రమబద్ధీకరణకు జీవోలు జారీ చేశాయని, ఇలాంటి సమస్య దేశం మొత్తం ఉన్న నేపథ్యంలో మొత్తం పరిస్థితి గురించి తెలుసుకోవడానికిగాను సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చిందన్నారు.

ఈ మేరకు డిసెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసిందని, దీనికి సంబంధించిన ఉత్తర్వుల కాపీ అందిందని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌లకు చెందిన జీవోలు 131, 152లు కూడా ఈ పరిధిలోకి వస్తాయన్నారు. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ సుప్రీం కోర్టు పిటిషన్‌తోపాటు ఉత్తర్వుల కాపీని హైకోర్టుతోపాటు అందరికీ అందజేయాలని ఆదేశించింది.

*ఈ దశలో సీనియర్‌ న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లించడానికి జనవరి 31వ తేదీ గడువుగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. సుప్రీం కోర్టులో తేలేదాకా ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇవ్వడంతో ధర్మాసనం నమోదు చేస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టులో తేలిన తరువాత వీటిపై విచారణ చేపడతామంటూ ఏప్రిల్‌ 28వ తేదీకి వాయిదా వేసింది*.

*link Media 🖋️ **

https://prajasankalpam1.blogspot.com/

ప్రజాధనం దుర్వినియోగం

https://twitter.com/Praja_Snklpm/status/1352128998151634944?s=08
21/01/2021

https://t.co/xvPRwWT3ax
అందరు ఆలోచించండి
@DrTamilisaiGuv
@KTRTRS
@MinisterKTR
@KTRoffice
@TelanganaCS
@SomeshKumarIAS
@SwachSurvekshan
@LubnaSarwath
@revathitweets
@IndiaAheadNews
@KVishReddy
@VijayGopal_
@RajNewsLive
@Teenmarmallana
@TeenmarMallanna
@TvNavtej
@HemaJurno

*తెలంగాణ యువమంత్రివర్యులు కేటీఆర్ సారు ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం న్యాయమేనా ?? అని ప్రజా సంకల్పం & link Media ప్రశ్నిస్తుంది. సామజిక కార్యకర్త Dr లుబ్నా సర్వత్ మేడం గారికి ధన్యవాదములు.*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/
 https://t.co/vWXDv1M3Ql

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.

హైదరాబాద్ : 20/01/2021

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు ఆపథకాలకు సంబందించి ప్రజలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

ఇక ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతోందని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. అదేవిధంగా ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని దేశంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని ఏజీ వివరించారు. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైకోర్టుకు, పిటిషనర్లకు సమర్పించాలని ఈ సందర్భంగా హైకోర్టు సీజే ధర్మాసనం ఏజీని ఆదేశించింది.ఇక సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

@hmtv మీడియా సౌజన్యంతో

బాపట్ల కృష్ణమోహన్ 

Monday, January 18, 2021

బెస్ట్ కోవిడ్ వారియర్ ఆఫీసర్ గా డీఐజీ సుమతి

హైదరాబాద్ : 19/01/2021

*బెస్ట్ కోవిడ్ వారియర్ ఆఫీసర్ గా డీఐజీ సుమతి.......!*

రాష్ట్రంలో బెస్ట్‌ కోవిడ్ వారియర్‌ విమెన్‌ ఆఫీసర్‌గా డీఐజీ బడుగుల సుమతిని డీజీపీ ఎంపిక చేశారు. కోవిడ్‌ విజృంభించిన వేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో పోలీసులు అందించిన సేవలు మరువలేనివి. మన రాష్ట్రంలో దాదాపు ఆరు వేలకుపైగా పోలీసులు వైరస్‌ బారిన పడగా.. దాదాపు 70 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసు అధికారుల వివరాలు అందజేయాలని నేషనల్‌ విమెన్‌ కమిషన్‌ (ఎన్‌సీ డబ్ల్యూ) అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.
దీంతో తెలంగాణ నుంచి డీఐజీ బడుగుల సుమతి పేరుని సోమవారం డీజీపీ డాక్టర్‌ ఎం.మహేందర్‌ రెడ్డి ఖరారు చేశారు.
డీఐజీ సుమతి లాక్‌డౌన్‌ కాలంలో డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలో సేవలందించారు. లాక్‌డౌన్‌ కాలంలో పేదలు, వలస కూలీలు, అన్నార్థులకు ఎక్కడికక్కడ ఆహారం, మందులు, బియ్యం, దుస్తులు చేరేలా నిరంతరం పర్యవేక్షించారు. అదే విధంగా అత్య వసర సేవలు, రాష్ట్రంలోనికి రావాల్సిన దిగు మతులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఎగుమతులకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించే బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు

DIG సుమతి మేడం గారికి అభినందనలు తెలియచేస్తుంది ప్రజా సంకల్పం & link Media.


బాపట్ల కృష్ణమోహన్

prajasankalpam1@gmail.com@

Praja_Snklpm (ట్విట్టర్)

prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)

prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/