Saturday, May 14, 2022

ఇక్కడ బతకలేం – ఎక్కడికైనా తరలించండి – కశ్మీర్ పండిట్ల వేడుకోలు

ఇక్కడ బతకలేం – ఎక్కడికైనా తరలించండి – కశ్మీర్ పండిట్ల వేడుకోలు

రాహుల్ భట్ హత్యతో కశ్మీర్ పండిట్లు మళ్లీ వణికిపోతున్నారు. కశ్మీర్ బుద్గాంలో ప్రభుత్వ కార్యాలయంలో విధుల్లో ఉన్న రాహుల్ భట్ ను ఉగ్రవాదులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయాందోళనల్లో ఉన్నారు అక్కడి పండిట్లు. తాము అక్కడ ఉండలేమని..ఏదైనా సురక్షిత ప్రాంతానికి తరలించాలని పండిట్ వర్గానికి చెందిన ప్రభుత్వఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుతున్నారు. కశ్మీర్లో తప్ప ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసేందుకు తాము సిద్ధమంటున్నారు వారు. ఇక్కడ బతుకలేమని… హత్యాకాండ మొదలుపెట్టారని వణుకుతున్నారు.

ఈ మేరకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కు ఆల్ పీఎం ప్యాకేజీ ఎంప్లాయీస్ ఫోరం లేఖ రాసింది. తాము పీఎం ప్యాకేజ్, నాన్-పీఎం ప్యాకేజ్ ఉద్యోగులమని, తమను కశ్మీర్ నుంచి సురక్షితంగా తరలించి రక్షించాలని వేడుకుంది. లేదంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని వారంటున్నారు

No comments:

Post a Comment