Tuesday, May 24, 2022

మంత్రి పువ్వాడ కు సామాజిక కార్యకర్త కోయిని వెంకన్న భహిరంగ లేఖ

*"మంత్రి పువ్వాడ చేస్తున్న అభివృద్ధి- గిట్టని వారు చేస్తున్న ఆరోపణలు*

*మంత్రి పువ్వాడ కు సామాజిక కార్యకర్త కోయిని వెంకన్న భహిరంగ లేఖ*

*స్వాగతిస్తార? తిరస్కరిస్తార?*

 మంత్రి మనుషులు పోలీసులతో కుమ్ను మాపై పెదుతున్న అక్రమ కేసులు, చేస్తున్న బెదిరింపులు చేస్తున్న అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, మేం చేస్తున్న చట్టపరమైన పోరాటాల గురించి తెలియ పరుచుట,

1. సామాజిక/RTI Activistని అయిన నాపై మూడు అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపించారు. 1) FLR. No. 157/21. Kmm I Town PS, 2) F.L.R.No.16/22 Chinthakkani P% 3.F.L.R.: No. 80/22, Raghunadhapalem) PS. (సెలవులు చూసి జైళ్ళో పెట్టించాడు).

2. వారి యొక్క అవినీతి, అక్రమాలను వెలికి తీస్తున్నానని నాపై సామ దాన, భేద దండోపాయలతో పాటు మా Yotube. Chunei BMAP INDIA కార్యాలయంపై అకస్మాత్తుగా పోలీసులతో దాడిచేయించి మంత్రి వీడియోలను తీసేశారు.

3. రఘునాధపాలెం మండలం, పువ్వాడ నగర్ గ్రామంలో 2127 ప్రభుత్వ ఇండ్ల స్థలాలను సుమారు రూ.35 కోట్ల కు అమ్ముకున్నారు. మేము లోకాయుక్తలో ఫిర్యాదు చేసాము. ఫిర్యాదు నెం. 856/2020/బి1. (విచారణలో ఉంది).

4. అక్కడే కోయచెలక రెవిన్యూ సర్వే నెం.192/1 లో 10యకరాలలో మట్టి తవ్వుకొనుటకు అనుమతి తీసుకుని ప్రక్కన వున్న మంచుకొండ, చింతగుర్తి, రఘునాదపాలెం రెవిన్యూ గుట్టలలో సర్వే నెం. 361, 362, 363, 364 & 266 & 30, 280 లలో సుమారు 150 యకరాలల కోటి క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి త్రవ్వి 150 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. దీనిపై మేము లోకాయుక్తలో ఫిర్యాదు చేసాము. ది.21-02-2022న లోకాయుక్త వారు రూ.16 కోట్లు జరిమాన విధించారు. ఫిర్యాదు నెం. 901/2020/బి1,

5. పోడు భూముల్లో 192 మంది యస్ టి. రైతులు ఇబ్బందులపై లోకాయుక్తలో ఫిర్యాదు 353/2020/బి1. చేశాం.

6. పురాన్ తండ్రి లో సర్వేనెం. 100. లో ఉన్న 86. మంది యస్.టి రైతుల పట్టా భూములలో ఉన్న మట్టి గుట్టను ఆ ఆక్రమించి రూ. పది కోట్ల విలువైన మట్టి ని అమ్ముకున్నారు. మాకు తెలిసిన రెండోవాడే మేం దాన్ని ఆపించాం.

7. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ యొక్క మమతా ఆసుపత్రి ప్రక్కన వున్న పేదలు టి.ఆర్.యన్. కు ఓటు వేయలేదని కక్షతో వర్షాకాలంలో కరోనా సమయంలో 68 ఇండ్లను నిర్ధాక్ష్యంణ్యంగా కూలగొట్టించ్చారు. దీనిపై మేము లోకాయుక్తలో ఫిర్యాదు చేసాము. ఫిర్యాదు నెం. 753/2021/01.

8. ఇదే మంత్రి పువ్వాడ అజయ్ మద్దులపల్లి గ్రామ సర్పంచ్ ను ప్రోటోకాల్ కి విద్దంగా అవమానించిన దానిపై మేము లోకాయుక్తలో ఫిర్యాదు చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చేట్లు చేసాము. ఫిర్యాదు నెం. 781/2020/బి1.

9. మమత ఆసుపత్రి ప్రాంతంలో మంత్రి క్రమబద్ధీకరణ చేయించుకున్న 70 కోట్ల విలువైన 15000 చ.గ.లు ఏమిటి.

10. అదే సమయంలో ఆయన అనుచరులు 69. మంది రూ.150, కోట్ల విలువైన స్థలాలను క్రమబద్ధీకరణ చేయించుకున్నారు.

11. ఖమ్మం నగరంలో జరుగుతున్న ప్రతిపని గురించిన పూర్తి వివరాలు బోర్డు పెట్టాలి. కాని మంత్రి బొమ్మలు పెడుతున్నారు.

12, ఖమ్మం నగరంలో కావి జిల్లాలో కాని ఎక్కడా సమాచార హక్కు చట్టం-2005, సక్రమంగా అమలు జరుగట్లేదు.

13. 1/70 చట్టం ను భూచిగా చూపించి రెవిన్యూ అధికారులు రైతులను పీక్కు తింటున్నారు. పోడు భూములు పట్టాలు వేటికి గిరిజనులకు నూరు శాతం అందించలేదు. పైగా వారిపై బెదిరింపులు, దాదులు చేస్తున్నారు.

14. పాత బస్టాండ్, పాత రైతుబజార్ లను అర్ధంతరంగా మూసివేసిన దానిపై లోకాయుక్తలో ఫిర్యాదు 531/02 చేసాము.

15. కొత్త బస్టాండ్ నాణ్యతాలోపాలపై లోకాయుక్తలో ఫిర్యాదు 483/2 చేసాము, ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు

వందలు చెప్పొచ్చు. మా Yotube Channel BMAP INDIA ఇతని అవినీతి అక్రమాలను ప్రచారం చేస్తున్నది.

16. మేము సమాచార హక్కు ద్వారా తీసుకున్న సమాచారంతో ప్రస్తుత Lokuyuktha, HRC, RTI Commission లో 13 మంది జడ్జీల నియామకానికి హైకోర్టులో ఫిల్ నెం. 209/19 వేసి విజయం సాధించాము.

17. ఇప్పటి వరకు 1,456 స.హ. ధరఖాస్తులు చేశాము, చేయించాము. నిరంతరం పువ్వాద, టి.ఆర్.యస్.. ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాము, ప్రజలను చైతన్యం చేస్తున్నాము.

18. మంత్రి మాట వినని అధికారులపై పలురాకలుగా కక్ష తీర్చుకుంటున్నాడని తెలిసింది. అతికొద్దిమంది అతనికి

బానిసలుగా, టి.ఆర్.యస్. కార్యకర్తలుగా మారారు. అందులో ఖమ్మం అర్బన్ తహశీల్దార్ ప్రముఖంగా వున్నారు.

19. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఐ.ఎ.యస్సా..1? టి.ఆర్. యస్సా..17 అనేట్లుగా వారి తీరు వున్నది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 7.కి.మీ దూరంలో వున్న పువ్వాడ నగర్ లో 2127 ప్రభుత్వ ప్లాట్లను సుమారు రూ. 35 కోట్లకు టి.ఆర్.యస్. కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి అమ్ముకున్నారు. అలాగే అక్కడే ప్రభుత్వ ప్రయివేటు భూములలో సుమారు రూ.150 కోట్ల విలువైన మట్టిని త్రవ్వి అమ్ముకున్నారు. ఆ రెండు విషయాలపై మేము పలుమార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ సంవత్సరం కావస్తున్నా ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు.

20. ప్రస్తుతం మంత్రి పువ్వాడకు కొరకరాని కొయ్యగా ఉన్నవారిలో మేము ప్రధములుగా ఉన్నాము. అందుకే కేసులు,

21. నేను, నాభార్య 30సం||లు సి.పి.యం పార్టీలో పూర్తి కాలం కార్యకర్తలుగా జిల్లాలో అన్ని ప్రాంతాలలో పనిచేసాము. ప్రస్తుతం RTI Activist,లుగా నిరంతరం ఇదే పనిచేస్తున్నాము. మా వలన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్నివేల మందికి దేవాలయ, అటవీ భూములు దక్కాయి. ప్రయోజనాలు జరిగాయి నీతి నిజాయితీయే మాకు రక్షణగా ఉ న్నది. కొనఊపిరి ఉన్నంత వరకు చట్టపరిధిలో ఇదే విధంగా ప్రజల మేలు కొరకు మా బృందం పనిచేస్తుంది.

22. మంత్రి గారు నిజాయితీ పరులే అయితే ది. 15-06-2022. లోపు ఖమ్మంలో ప్రశాంత విశాల ప్రదేశంలో "మంత్రి పువ్వాడ చేస్తున్న అభివృద్ధి- గిట్టని వారు చేస్తున్న ఆరోపణలు" అనే అంశంపై ఇష్టా గోష్టి చర్చకు అన్ని ఏర్పాట్లు చేసి సమయం నిర్ణయించి తన యొక్క నిజాయితీ, సమర్ధం నిష్పక్షపాతం చేస్తున్న అభివృద్ధి ప్రజా ప్రయోజనం వంటివి నిరూపించుకోవాలి. ఆరోపణలు చేస్తున్న వారిని సావధానంగా ఆహ్వానించి చర్చకు ఆహ్వానించాలి. అవకాశం ఇవ్వాలి. తన యొక్క శ్వేత సేవలను తెలియపరచాలి. ప్రజలందరి సహకారం కోరాలి. ఇటువంటి మంచి సత్ సంప్రదాయానికి పునాధి చేయాలి. ఖమ్మం చరిత్రలో మిగిలిపోవాలి. అలా చేయుటకు మంత్రి పువ్వాడ గారు సిద్ధంగా లేకపోతే మేము, ఇతర పెద్దలు, ప్రజలు చేస్తున్న ఆరోపణలు నిజాలుగా భావిస్తాం అన్నారు

No comments:

Post a Comment