Friday, May 27, 2022

నదిలో పడ్డ వాహనం....7గురు జవాన్ల దుర్మరణం

*నదిలో పడ్డ వాహనం....7గురు జవాన్ల దుర్మరణం*

శ్రీనగర్‌: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తోన్న ఓ వాహనం నదిలో పడి ఏడుగురు దుర్మరణం చెందారు.మరో 19 మంది గాయపడ్డారు. శుక్రవారం ఉదయం పార్థాపూర్‌ శిబిరం నుంచి 26 మంది సైనికులు వాహనంలో హనీఫ్‌ సబ్‌ సెక్టార్‌ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

టుర్టుక్‌ సెక్టార్‌ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదవశాత్తు రోడ్డుపై నుంచి జారి షియోక్‌ నదిలో పడింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌ అంబులెన్స్‌లో సైనికులను పశ్చిమ కమాండ్‌కు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment