Tuesday, June 7, 2022

3వసారి బీజేపీ కీ అధికారం ఇస్తే దేశం ముక్కలు అవ్వడ్డం.... ఖాయం.... వీహెచ్

*3వసారి బీజేపీ కీ అధికారం ఇస్తే దేశం ముక్కలు అవ్వడ్డం.... ఖాయం.... వీహెచ్*

భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపికి మూడవసారి అధికారం ఇస్తే భారతదేశం ముక్కలు కావటం ఖాయం అంటూ విమర్శించారుదేశాలన్ని ముక్కలు చేయాలని బీజేపీ ఆలోచనగా కనిపిస్తోందని అందుకే బీజేపీ నేతలు మతాల మధ్య విధ్వేషాలు కలిగించే వ్యాఖ్యలు చేస్తుంటారని మండిపడ్డారు. బీజేపీ నేతలు రోజుకో రకమైన వ్యాఖ్యలు చేసి వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇతర మతాలను కించపరచటమే బీజేపీ ఎజెండాగా ఉందని అన్నారు. మతాల మధ్య విద్వేషాలు కలిగించేవారిపై చర్యలు తీసుకోవాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు వీహెచ్.

దేశాన్ని ముక్కలు చేయటమే బీజేపీ ఎజెండా అని..కానీ కాంగ్రెస్ మాత్రం దేశాన్ని ఏకత్రాటిపై నడిపించే పార్టీ అని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి ఓటు వేయాలని కోరారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర చేపడుతున్నాం అని వీహెచ్ తెలిపారు. దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది అని ముఖ్యంగా అత్యాచారలు పెరుగుతున్నాయని అన్న వీహెచ్చ అత్యాచారానికి పాల్పడినవారిని మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే దారుణాలు తగ్గుతాయని అన్నారు. కోర్టుకు వెళ్లిన అత్యాచారాల కేసుల్లో తీర్పులు త్వరితగతిన వెలువడాలని అన్నారు. అలా చేస్తే నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు.

కాగా..2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో వచ్చే ఎన్నికల కార్యాచరణపై చర్చించారు కాంగ్రెస్ నేతలు. దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రకు ప్రణాళికలు వేశారు. దీంట్లో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలు కానుంది. భారత్ జోడో యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాహుల్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటి, టాస్క్ ఫోర్స్ 2024 గ్రూప్ తో పాటు భారత్ జోడో యాత్ర ప్లానింగ్ మరియు కో ఆర్డీనేషన్ కోసం ప్రత్యేక కమిటీలను ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ప్రకటించారు.

ఏఐసీసీ ప్రకటించిన పొలిటికల్ అఫైర్స్ కమిటిలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, అనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, జితేందర్ సింగ్ ఉన్నారు. టాస్క్ ఫోర్స్ 2024 గ్రూప్ లో పి చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ వాద్రా,రణదీప్ సింగ్ సూర్జేవాలా, కే సునీల్ ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. భారత్ జోడో యాత్ర సెంట్రల్ ప్లానింగ్ మరియు కో ఆర్డీనేషన్ గ్రూప్ లో దిగ్విజయ్ సింగ్, సచిన్ పైలెట్, శశి థరూర్, రణవీత్ సింగ్ భట్టు, కేజే జార్జ్, జోతి మని,ప్రద్యుత్ బోర్డోలూయి, జితూ పత్వారి, సలీమ్ అహ్మద్ ను అపాయింట్ చేసింది.

link Media ప్రజల పక్షం🖋️ 

Monday, June 6, 2022

తెలంగాణ లో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అని ప్రజా సంకల్పం గ్రూప్ ద్వారా PMO ఆఫీస్ కు వాస్తవాలతో ఫిర్యాదు చేయడం జరిగింది

👆తెలంగాణ లో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అని ప్రజా సంకల్పం గ్రూప్ ద్వారా PMO ఆఫీస్ కు వాస్తవాలతో ఫిర్యాదు చేయడం జరిగింది.
Bplkm🪶

Your Communication has been registered with registration number - PMOPG/E/2022/0_____. Please visit at: https://pgportal.gov.in/status for further details.
Copy to Group link Media
 07/06/2022 prajasankalpam1.blogspot.com

నలుగురు పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించిన..... హైకోర్ట్

నలుగురు పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించిన..... హై కోర్ట్*

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఒకటి ఇచ్చింది. నలుగురు పోలీసు అధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు.

జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ కు జైలు శిక్ష విధించింది హైకోర్టు. అంతేకాదు నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఈ పోలీసు అధికారుల మీద గతంలో భార్యభర్తల వివాదం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం నిబంధనల మేరకు సీఆర్ పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగం మోపబడింది. అయితే.. అప్పీలు వెళ్లేందుకు నాలుగు వారాల జైలు శిక్ష అమలును.. ఆరు వారాల పాటు నిలిపివేసింది తెలంగాణ హైకోర్టు.

link Media ప్రజల పక్షం🖋️

Sunday, June 5, 2022

నేటి నుంచి టెట్ హాల్ టికెట్ల జారీ....12న యధావిధిగా పరీక్ష! పీజీ ఎంట్రన్స్‌ షెడ్యూల్‌ విడుదల నేడే....!

*నేటి నుంచి టెట్ హాల్ టికెట్ల జారీ....12 యధావిధిగా పరీక్ష!*

*పీజీ ఎంట్రన్స్‌ షెడ్యూల్‌ విడుదల నేడే....!*

*హైదరాబాద్‌*

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను ముందుగా నిర్ణయించినట్టుగానే ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నారు.టెట్‌ పేపర్‌-1 కోసం 3,51,468 మంది, పేపర్‌-2 కోసం 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి హాల్‌ టికెట్లను జారీ చేయనున్నట్లు టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి ప్రకటించారు. పేపర్‌-1 పరీక్ష ఉదయం, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం జరగనున్నాయి. కాగా...

పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆదివారం టెట్‌ మోడల్‌ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ నారాయణగూడలోని పీఆర్‌టీయూ కార్యాలయంలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి తదితరులు ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. అలాగే... యూటీఎఫ్‌ ఆధ్వర్యంలోనూ ఆదివారం టెట్‌ మోడల్‌ పరీక్ష జరిగింది.

రంగారెడ్డి జిల్లాలోని మూడు సెంటర్లలో పరీక్షను నిర్వహించినట్టు యూటీఎఫ్‌ అధ్యక్షుడు జంగయ్య తెలిపారు. కాగా... కామన్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ) షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూ తదితర సంస్థల్లో పీజీ సీట్ల భర్తీ కోసం ఈ ఏడాది నుంచి కామన్‌ ఎంట్రన్స్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

link Media ప్రజల పక్షం🖋️

ఓయూ ప్రైవేట్ కాలేజీల్లో పీహెచ్ డీ కోర్సులు.....ఉస్మానియా యూనివర్సిటీ

*ఓయూ ప్రైవేట్ కాలేజీల్లో పీహెచ్ డీ కోర్సులు.....*

*ఉస్మానియా యూనివర్సిటీ*

హైదరాబాద్‌): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పీహెచ్‌డీ కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు.ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, న్యాయశాస్త్రం, వ్యాయామ విద్య, ఎడ్యుకేషన్‌ తదితర కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఆయా కాలేజీల్లో రీసెర్చ్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంత కాలం కేవలం ఓయూ కాలేజీలకే పరిమితమైన పీహెచ్‌డీ కోర్సు కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటుతో ఇక నుంచి ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో కూడా కొనసాగనుంది. రీసెర్చ్‌ సెంటర్ల అనుమతికి ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఈనెల 10 వరకు అవకాశం కలి్పంచారు. యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత వలన క్యాంపస్, అనుబంధ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో పీహెచ్‌డీ సీటు ఒక్కటి కూడా లేదు.

దీంతో ఐదేళ్లుగా పీహెచ్‌డీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు నిలిచిపోయాయి. వర్సిటీ అభివృద్ధికి చేపట్టిన పలు సంస్కరణల్లో భాగంగా పరిశోధన విద్యార్థుల సంఖ్యను పెంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన పరిశోధనల కోసం పీహెచ్‌డీ ప్రవేశాలకు రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. గత నెలలో జరిగిన పాలక మండలి సమావేశంలో రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటుకు సభ్యుల ఆమోదం లభించినందున ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో కూడా పీహెచ్‌డీ కోర్సులకు అనుమతించాలని నిర్ణయించారు. ఓయూ పరిధిలో పలు పీజీ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో పరిశోధనలకు కావాల్సిన మౌలిక వసతులు, ప్రయోగశాలలు, గైడ్‌íÙప్‌ అర్హత గల ఇద్దరు అధ్యాపకులు ఉన్న కాలేజీలకు రీసెర్చ్‌ సెంటర్‌కు అనుమతి ఇవ్వనున్నారు.
*ఓయూ ద్వారానే పీహెచ్‌డీ ప్రవేశాలు, పరీక్షలు: రిజి్రస్టార్‌*
రీసెర్చ్‌ సెంటర్లకు అనుమతి లభించిన ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలతో పాటు ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు, వైవా (సెమినార్‌) ఓయూ చేపడుతుందని రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థి ఆయా ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశోధనలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్‌డీ ఫీజులు కూడా ప్రైవేట్, అటానమస్‌ కాలేజీలకు చెల్లించాలని సూచించారు. ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో పీహెచ్‌డీ చేసే విద్యార్థులకు ఓయూ క్యాంపస్‌లో హాస్టల్‌ వసతి ఉండదని లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు.

link Media ప్రజల పక్షం🖋️

బండి సంజయ్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదు.....??..KTR

బండి సంజయ్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదు.....??..KTR

ఓ మత వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! ట్విటర్ మాధ్యమంగా ఆమెకు వంత పాడిన నవీన్ కుమార్ జిందాల్‌పై సైతం ఆ పార్టీ వేటు వేసింది.వీరి వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో.. వారిని సస్పెండ్ చేస్తూ బీజేపీ సంచలన ప్రకటన చేసింది. ఇదే సమయంలో తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను గౌరవిస్తుందని, మతపరమైన వ్యక్తుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే బీజేపీ సహించదని, అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించదని బీజేపీ తన ప్రకటనలో పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ''బీజేపీ నిజంగానే అన్ని మతాలను గౌరవిస్తే.. అన్ని మసీదులను తవ్వి, ఉర్దూపై నిషేధం విధించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?'' అంటూ జేపీ నడ్డాని ట్యాగ్ చేస్తూ ట్విటర్ మాధ్యమంగా కేటీఆర్ ప్రశ్నించారు. ''ఈ సెలెక్టివ్ ట్రీట్మెంట్ ఎందుకు? దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వండి'' అని ఆయన నిలదీశారు. కాగా.. హిందూ ఏక్తా కార్యక్రమంలో బండి సంజయ్ తెలంగాణలో ఉన్న మసీదులను తవ్వాలని అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు. శవాలొస్తే మీకు, శివలింగాలొస్తే మాకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తెలంగాణ తీవ్ర దుమారం రేపాయి.

link Media ప్రజల పక్షం🖋️ 

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్.....బెంజ్ కారులో కీలక ఆధారాలు?

*జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్.....బెంజ్ కారులో కీలక ఆధారాలు?*

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పెద్దల ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తును నీరుగారుస్తున్నారంటూ విపక్షాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు దూకుడు పెంచారు.ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ప్రకటించిన పోలీసులు మరో నిందితుడు ఉమర్ ఖాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈకేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ను నియమించారు.

ఈకేసులో ఇప్పటికే నిందితులు దుశ్చర్యకు ఉపయోగించిన రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌ టీమ్‌తో పాటు, ఫోరెన్సిక్‌ నిపుణులు బెంజికారుతో పాటు ఇన్నోవా కారును ఆదివారం సాయంత్రం క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, బెంజికారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పును క్లూస్‌ టీమ్‌ సీజ్‌ చేసింది. ఇన్నోవా కారులో ఎలాంటి ఆధారాలు లభించాయనేది మాత్రం పోలీసులు ఇంకా స్పష్టం చేయలేదు. ఈ ఘటన గత నెల 28న జరిగితే పోలీసులకు బాధితురాలి తండ్రి 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అదే రోజు పోక్సో కేసు నమోదు చేశారు. మరుసటి రోజు బెంజి కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారు గురించి రెండు మూడు రోజులు పట్టించుకోలేదు. ఇన్నోవా కారును ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత నిన్న సాయంత్రం మొయినా బాద్‌లో స్వాధీనం చేసుకున్నారు.
ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలోనే నిందితులు.. వాహనం చిక్కకుండా మొయినా బాద్‌లోని ఓ రాజకీయనేత ఫామ్‌హౌస్‌ వెనుక దాచేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారుపై ఉన్న ప్రభుత్వ స్టిక్కర్‌ కనిపిచంచకుండా, టీఆర్‌ నంబర్‌కూడా గుర్తుపట్టకుండా చేశారు. ఇన్నోవా కారు వ్యవహారంపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి. మరో వైపు ఘటన తర్వాత షాక్‌కు గురైన బాలిక పూర్తిగా కోలుకోవడంతో పోలీసులు మరో సారి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు.

link Media ప్రజల పక్షం🖋️