Saturday, June 4, 2022

అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

55 IST
అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

Courtesy by : ఈనాడు మీడియా ట్విట్టర్ 

అంతకుముందు బెంజి కారులో అసభ్య ప్రవర్తన

ఇన్నోవాపై ‘ప్రభుత్వ వాహనం’ స్టిక్కర్‌!

నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ అరెస్టు

ఇద్దరు మైనర్లు జువైనల్‌ హోంకు

నిందితుల్లో ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు, సంగారెడ్డి జిల్లా తెరాస నేత కుమారుడు

ఎమ్మెల్యే కుమారుడిపైనా కేసు నమోదుకు అవకాశం

అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: రాజధానిలో జరిగిన సామూహిక అత్యాచార ఉదంతంలో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఒక ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ (ఏదైనా కేసులో నిందితులు మైనర్లు అయితే వారి పేర్లే కాకుండా తల్లిదండ్రుల పేర్లు సహా నిందితులను గుర్తించే వివరాలను ప్రచురించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తండ్రి పేరు, సంస్థపేరు రాయడం లేదు) అధికారికంగా వినియోగించే ఇన్నోవా వాహనంలోనే బాలికపై అత్యాచారం జరిగిందని సమాచారం. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబరుతో ఉన్న ఈ వాహనానికి ‘ప్రభుత్వ వాహనం’ అనే స్టిక్కర్‌ ఉందని సీసీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మెయినాబాద్‌ పరిసరాల్లో ఈ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్‌, ఒక ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అమేర్‌ఖాన్‌, ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, బల్దియా కార్పొరేటర్‌ కుమారుడు, సంగారెడ్డి జిల్లా తెరాస పార్టీ నాయకుడి కుమారుడు బాలికపై అత్యాచారం చేశారని పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. శుక్రవారం రాత్రి సాదుద్దీన్‌ను అరెస్టు చేయగా శనివారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడిని, బల్దియా కార్పొరేటర్‌ కుమారుడిని జువైనల్‌ హోంకు తరలించారు. ఒక ఎమ్మెల్యే కుమారుడు బాలికతో చనువుగా ప్రవర్తించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో పోలీసులు అతడిని కూడా నిందితుడిగా చేర్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

బెంజి కారు నుంచి ఇన్నోవాకు మార్చి..

జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌కు మే 28న వచ్చిన బాలికను ఇంటివద్ద దిగబెడతామంటూ ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు బెంజి కారులో ఎక్కించుకున్నారు. అందులో పబ్‌ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్తున్నప్పుడే బాలికపై అత్యాచారయత్నం చేసినట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని కాన్సు బేకరీ వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడికి ఇన్నోవా కారును డ్రైవర్‌ తీసుకురాగా.. ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు ఇప్పుడే వస్తామంటూ వేచి ఉండాలని డ్రైవర్‌కు చెప్పి అతడిని వదిలి వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో కన్పించింది. సాదుద్దీన్‌ మాలిక్‌ (18), అమేర్‌ ఖాన్‌ (18)లతో పాటు ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు (16), సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత కుమారుడు (16), బల్దియా కార్పొరేటర్‌ కుమారుడు (16) కలిసి బాలికను బెదిరించి ఆమెను బెంజి కారు నుంచి ఇన్నోవా వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇన్నోవాలో ఎమ్మెల్యే కుమారుడు (17) సైతం ఉన్నాడు. అతడు కొద్ది నిమిషాల్లోనే కారు దిగి బేకరీ వైపు వెళ్లాడని తొలుత పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తాజాగా హల్‌చల్‌ అయిన వీడియో నేపథ్యంలో మరోసారి బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు అతడిని ఏ6 నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

పోలీసు దర్యాప్తుపై అనుమానాలు

పోలీసులు చేస్తున్న ప్రకటనలకు, వాస్తవాలకు తేడా ఉండడంతో పరిశోధన, దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికను తీసుకెళ్తున్న బెంజికారు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36 నుంచి చెక్‌పోస్టు కూడలి మీదుగా కేబీఆర్‌ కూడలి నుంచి రోడ్‌ నం.14 వైపు వెళ్లినట్లు గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోల్లో బాధితురాలిని ఓ బాలుడు అతి దగ్గరగా తీసుకుని ముద్దాడడం, స్నేహితులు వీడియోలు తీయడం కనిపించింది. బాలికను ముద్దాడింది ఎమ్మెల్యే కుమారుడేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని పక్కనే ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ తనయుడు ఉన్నారు. అత్యాచారం చేశాక.. బాలికను పబ్‌ వద్ద దించేసిన నిందితులు.. బేకరీ వద్ద గ్రూప్‌ ఫొటో దిగారు. కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దిగాయి.

* ఈ ఘటన గత నెల 28న జరిగితే పోలీసులకు బాధితురాలి తండ్రి 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అదే రోజు పోక్సో కేసు నమోదు చేశారు. మరుసటి రోజు బెంజి కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారు గురించి రెండు మూడు రోజులు పట్టించుకోలేదు.

* ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలోనే నిందితులు దాన్ని చిక్కకుండా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజులైనా ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు.

* ఓ రాజకీయ నాయకుడి సూచనతో కేసు తీవ్రరూపం దాల్చకముందే ఎమ్మెల్యే కుమారుడిని దుబాయ్‌కి పంపేశారని సమాచారం.

ముగ్గురు నిందితులు ప్రజాప్రతినిధుల తనయులే

నిందితుల్లో ముగ్గురు.. ప్రజాప్రతినిధుల తనయులే. ఒకరి తండ్రి బల్దియా కార్పొరేటర్‌గా పనిచేసి ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కాగా.. మరొకరి తండ్రి ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్నారు. మరొక నిందితుడి తండ్రి సంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి. మిగిలిన ఇద్దరు నిందితుల్లో అమేర్‌ఖాన్‌ (18) ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు. ఆ ఎమ్మెల్యే కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మరో నిందితుడు సాదుద్దీన్‌ తండ్రికి ఒక పార్టీ ప్రజాప్రతినిధితో సంబంధం ఉంది.

ఫోన్లు గోవాకు.. నిందితులు కర్ణాటకకు

నిందితులు పోలీసులను పక్కదారి పట్టించేందుకు ముందుగానే పథకం సిద్ధం చేసుకున్నారు. గత నెల 29వ తేదీనే తామంతా గోవాకు వెళ్తున్నామంటూ స్నేహితులకు చెప్పారు. వీరు గోవాకు వెళ్లకుండా ఇద్దరు వ్యక్తులకు తమ సెల్‌ఫోన్లు ఇచ్చి అక్కడికి పంపించారు. వీరు మరో సిమ్‌కార్డు తీసుకుని కర్ణాటకు వెళ్లారు.

అది మద్యం రహిత పార్టీయే! 

అమ్నీషియా పబ్‌లో జరిగిన పార్టీలో మద్యం సరఫరా కాలేదని ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలుసుకున్నారు. ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థుల తరఫున ఓ విద్యార్థి వీడ్కోలు పార్టీకి బాధితురాలు సహా 153 మంది హాజరయ్యారని వారు వివరాలు సేకరించారు.


కుమార్తె బాధను పసిగట్టిన తల్లి

సామూహిక లైంగిక దాడితో ఇప్పటికీ షాక్‌లోనే బాలిక

ఈనాడు, హైదరాబాద్‌: సామూహిక లైంగిక దాడికి గురైన బాలిక ఇప్పటికీ ముభావంగానే ఉంటోంది. భయంభయంగా స్పందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ‘ఈనాడు’ ఆరా తీయగా పలు విషయాలు తెలిశాయి. వీడ్కోలు పార్టీకి వెళ్లేందుకు ముందు రోజే బాలిక తల్లిదండ్రుల అనుమతి తీసుకుంది. ఉదయాన్నే స్నేహితురాలితో కలసి బయటకు వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకూ మిత్రుల మధ్య సరదాగా గడిపింది. 5.30 గంటలకు ఇంటికి తిరిగిరావాల్సిన ఆమె ఆలస్యంగా చేరుకుంది. ఎంతో సంతోషంగా వెళ్లిన ఆమె.. తిరిగొచ్చాక మౌనంగా ఉండిపోయింది. ఎప్పుడూ గలగలా మాట్లాడే బిడ్డ.. నిశ్శబ్దంగా ఉండటాన్ని కన్నపేగు పసిగట్టింది. తొలుత పార్టీలో డ్యాన్స్‌, ప్రయాణ బడలిక కారణం కావచ్చనుకుంది. అయినా అమ్మ మనసు ఎందుకో కీడు శంకించింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. బిడ్డ నుంచి ముభావంగా సమాధానాలు రావటంతో తన ఆందోళన నిజమని నిర్ధారించుకుంది. వాస్తవం ఏమిటో చెప్పకపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతోందనే ఉద్దేశంతో నగరంలోని ఓ మనస్తత్వ నిపుణుడి వద్దకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. వారిచ్చిన సూచనతో భరోసా కేంద్రానికి వెళ్లారు. అక్కడ కౌన్సెలర్లు బాలికను ప్రేమగా పలకరించి విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. షాక్‌లో ఉన్న ఆమె మాట్లాడలేకపోతోంది. ఆమెతో అసలు విషయం చెప్పించేందుకు కౌన్సెలర్లు ఓపికతో ప్రయత్నించారు. చివరకు ఆమె కన్నీరు తుడుచుకుంటూ మూడ్రోజుల నుంచి తాను అనుభవించిన నరకాన్ని వారితో పంచుకుంది. స్నేహితులని నమ్మి వెళ్తే తనపట్ల ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తించారో వివరించింది. అనంతరం నిర్వహించిన  వైద్య పరీక్షల్లో సామూహిక లైంగిక దాడికి గురైనట్టు గుర్తించారు. శరీరంపై గాయాలు చూసిన కన్నతల్లి కన్నీరుమున్నీరైనట్లు సమాచారం. నిందితులకు శిక్ష పడాలని ఆ తల్లి వేడుకున్నట్టు తెలిసింది. కుమార్తె ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

WORLD ENVIRONMENT DAY

Friday, June 3, 2022

జూబ్లీహిల్స్‌లో దారుణం... పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం

 జూబ్లీహిల్స్‌లో దారుణం... పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం

Hyderabad News: జూబ్లీహిల్స్‌లో దారుణం... పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం

Courtesy by : ఈనాడు మీడియా ట్విట్టర్ 

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కొందరు కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... గత నెల 28న ఓ బాలిక (17) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. దాదాపు 150 మంది 28వ తేదీ మధ్యాహ్నం 1గంట నుంచి 6గంటల వరకు అక్కడే మద్యం రహిత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసే సమయానికి పావుగంట ముందు పబ్‌ నుంచి బాలిక బయటకు వచ్చింది. 

అక్కడే ఉన్న రెండు కార్లలో యువతితో పాటు మరో 8మంది యువకులు బయల్దేరారు. ఇందులో బెంజికారుతో పాటు ఇన్నోవా కారు కూడా ఉంది. బెంజికారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు, మరో ప్రజాప్రతినిధి కుమారుడు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం బాలిక .. ప్రజాప్రతినిధి  కుమారుడు, అతని స్నేహితులు నలుగురితో కలిసి ఇన్నోవా కారు బయల్దేరింది. నిర్జన ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు .. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం 7.30గంటలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలిక ఫోన్‌ చేయడంతో తండ్రి   వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. ఐదుగురు కారులో తనపై దాడికి పాల్పడ్డారని చెప్పడంతో ఆమె తండ్రి  జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇన్నోవా కారులో 16, 17 ఏళ్ల బాలురు ఉన్నారని, వారిలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు, టాస్క్‌ పోర్స్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయంపై సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బెంజి కారును పోలీసులు సీజ్‌ చేశారు.


R. కృష్ణయ్య పై రాయదుర్గం పీఎస్ లో..... కేసు నమోదు

*R. కృష్ణయ్య పై రాయదుర్గం పీఎస్ లో..... కేసు నమోదు*

హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్యపై కేసు నమోదైంది. తన భూమిని ఆక్రమించుకునేందుకు రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.కోర్టు ఆదేశాల మేరకు రాయదుర్గం పోలీసులు ఆర్.కృష్ణయ్యపై 506, 447, 427, 506, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్.కృష్ణయ్యతో 40 ఏళ్లుగా స్నేహం ఉందని, తన భూమిని కబ్జా చేసి చంపాలని చూశారని రవీందర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️

ఆర్య సమాజ్‌ జారీ వివాహ ధ్రువీకరణ పత్రాలు చెల్లవని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.

*ఆర్య సమాజ్ పెళ్లిళ్లపై.....సుప్రీంకోర్టు కీలక తీర్పు.....!*

దిల్లీ: ఆర్య సమాజ్‌ లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్య సమాజ్‌ జారీ వివాహ ధ్రువీకరణ పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది.అలాంటి సర్టిఫికేట్లు ఇవ్వడం ఆర్య సమాజ్‌ పని కాదని తేల్చి చెప్పింది. మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమపెళ్లిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది.

link Media ప్రజల పక్షం🖋️ 

Thursday, June 2, 2022

జాతీయ జెండాను అగౌరపరిచిన కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే

*జాతీయ జెండాను అగౌరపరిచిన కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే*

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అగౌరపరిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ - గాజులరామారం జంట సర్కిళ్ల కార్యాలయాల వద్ద షూ వేసుకుని ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే వివేకానంద... అంబేద్కర్ ఫోటో వద్ద ఎమ్మెల్యే షూ వేసుకుని పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ జెండాను అగౌరపరిచిన కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కాగా... ప్రగతి భవన్‌లో అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పులు లేకుండా జాతీయ జెండాను గౌరవించి పాతాకావిష్కరణ చేశారు. దీంతో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం అలా... ఎమ్మెల్యేలు ఇలా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు విసిరారు..

 link Media ప్రజల పక్షం 

టార్గెట్​ తెలంగాణ.. రంగంలోకి దిగిన మోడీ

టార్గెట్​ తెలంగాణ.. రంగంలోకి దిగిన మోడీ

Courtesy by Disha Web  2 June 2022 5:00 AM దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. వచ్చే ఎన్నికల్లో టార్గెట్​తెలంగాణగా పావులు కదుపుతోంది. ఈ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా ప్రణాళిక చేస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇన్నేండ్లలో ఎన్నడూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించిన దాఖలాలు లేవు. అలాంటిది ఈసారి ఢిల్లీలో అధికారికంగా ఘనంగా ఆవిర్భావ ఏర్పాట్లు నిర్వహిస్తోంది. తెలంగాణపై జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిగా దృష్టిసారిస్తుందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. సాధారణంగా ఇలాంటి జాతీయ స్థాయి సమావేశాలు ఆయా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లేదా త్వరలో అధికారంలోకి వస్తామనుకున్న రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. దీని ద్వారా బీజేపీ నాయకత్వం తెలంగాణ గడ్డ త్వరలో తమదేననే స్పష్టమైన ఇండికేషన్​ఇచ్చేందుకే ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. Also Read - పంజాబ్ ప్రభుత్వం యూటర్న్! జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్​వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 18 మంది ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలంతా తరలిరానున్నారు. 300 మంది డెలిగేట్లతో పాటు మొత్తం దాదాపు వెయ్యి మంది వరకు ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ప్రధాని మోడీ రెండ్రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఈ రెండ్రోజుల్లో తెలంగాణ రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రెండ్రోజులు రాజ్​భవన్‌లో బస చేస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఏకంగా ప్రధాని రెండ్రోజులు ఇక్కడే మకాం వేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉండగా సమావేశ నిర్వహణ వేదిక మాత్రం ఖరారు కావాల్సి ఉంది. Also Read - అతడో కుట్ర సిద్ధాంత కర్త.. కేజ్రీవాల్‌పై స్మృతి ఇరాణి హాట్ కామెంట్స్.. రాష్ట్రంలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ హైకమాండ్​మొత్తం హైదరాబాద్‌కు తరలిరానుంది. తెలంగాణలో తాము అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలు అటు ప్రజలకు, ఇటు శ్రేణులకు ఇవ్వనుంది. తెలంగాణలో బీజేపీ అవసరం ఉందనే విషయాన్ని నొక్కి చెప్పనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్​అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేయనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందకు ప్రత్యేక కార్యాచరణ, అమలు చేయాల్సిన వ్యూహాలపై క్లారిటీ ఇవ్వనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా వచ్చారు. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వచ్చారు. అఫీషియల్​ప్రోగ్రాం అయినా మోడీ అనుకున్న షెడ్యూల్‌కు 35 నిమిషాల ముందుగానే నగరానికి చేరుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన వల్ల జరగుతున్న నష్టాలను ప్రజలకు, శ్రేణులకు వివరించారు. ప్రధాని సైతం తాను అనుకున్న షెడ్యూల్‌కు ముందే వచ్చి కేసీఆర్​పై చేసిన విమర్శలతో రాజకీయంగా మరింత హీట్​పెంచారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బలంగా నమ్మడం వల్లే ప్రధాని సైతం అఫీషియల్​కార్యక్రమానికి వచ్చి రాజకీయ విమర్శలు చేసి పార్టీ శ్రేణుల్లో జోష్​నింపారు. Also Read - Raja Singh: ఆ టెంపుల్‌ను ముట్టుకుంటే చెయ్యి నరికేస్తా.. ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయింది. క్రమంగా తెలంగాణ సర్కార్​పై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే జేపీ నడ్డా, అమిత్​షా, ప్రధాని మోడీ వచ్చి రాష్ట్రంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ విమర్శలు చేశారు. శ్రేణులు, నాయకులు, కార్యకర్తల్లో ఫుల్​జోష్​నింపారు. ఈ సమావేశాలతో ఈ జోష్​లెవల్స్​వేరే లెవల్​లో ఉంటాయని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. తమ పార్టీకి ఈ సమావేశాలు ఫుల్​మైలేజీ ఇస్తాయని బలంగా నమ్ముతోంది. వచ్చే ఎన్నికల్లో తమ గెలుపును అడ్డుకునేవారు ఎవరూ లేరని ధీమా వ్యక్తం చేస్తోంది. హుజురాబాద్​లాంటి గెలుపును రాష్ట్రవ్యాప్తంగా తీసుకురావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు కొనసాగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తే బాగుటుందనే చర్చ బీజేపీలో సాగుతోంది. సమావేశం కోసం స్థల పరిశీలనలో రాష్ట్ర నాయకత్వం తలమునకలైంది. ఇప్పటికే హెచ్ఐసీసీతో పాటు నోవాటెల్, తాజ్​కృష్ణ హోటళ్లను సందర్శించారు. బీజేపీ జాతీయ స్థాయి నేతలు వస్తున్న నేపథ్యంలో ఆతిథ్యంలో ఏమాత్రం రాజీ పడొద్దని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు చేస్తోంది. కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, దాదాపు 300 మంది డెలిగేట్స్, జాతీయ స్థాయి నేతలు వస్తున్న నేపథ్యంలో వారి బస ఏర్పాట్లపై రాష్ట్ర నాయకత్వం దృష్టిసారిస్తోంది. ప్రముఖ హోటల్‌లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల బసను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బుధవారం బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బీఎల్​సంతోశ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్​చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి హెచ్​ఐసీసీ, తాజ్​కృష్ణ, నోవాటెల్​వంటి పలు హోటళ్లను పరిశీలించారు. అనంతరం విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్, నల్లు ఇంద్రసేనా రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి జాతీయ కార్యవర్గ సమావేశానికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. బండి పాదయాత్రకు బ్రేక్ జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో కొనసాగనున్న నేపథ్యంలో బండి సంజయ్​మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్రకు బ్రేక్​పడనుంది. రెండు విడుతలు పూర్తి చేసిన బండి ఈనెల 23 నుంచి 20 రోజుల పాటు అంటే జూలై 12వ తేదీ వరకు యాదాద్రి నుంచి వరంగల్ వరకు మూడో విడుత పాదయాత్ర చేపట్టాలని తొలుత నిర్ణయించుకున్నారు. జూలై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలున్న నేపథ్యంలో మూడో విడుత పాదయాత్ర రద్దు చేసుకోనున్నారు. ఈ యాత్ర ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలను 2004 లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించారు. ఈసారి నిర్వహించే సమావేశాలనికి హైదరాబాద్​రెండోసారి వేదిక కానుంది.

https://www.dishadaily.com/political/the-bjp-high-commands-vision-is-here-on-telangana-131143