Thursday, August 29, 2024

*చెరువులు, ప్రభుత్వ భూములు పరిరక్షణ పూర్తి స్థాయిలో @Comm_HYDRAA కు బాధ్యత*

చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి నేడు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

దీనిలో భాగంగా, ఓ. ఆర్. ఆర్. పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో @Comm_HYDRAA కు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్టు  తెలిపారు.

ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ డీజీ శ్రీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ శ్రీ మహేష్ భగవత్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.

Courtesy / Source by :  https://x.com/TelanganaCS/status/1829105662804086830?t=9Q-DgZwhPxaFSMtB2csp9Q&s=19




No comments:

Post a Comment