Friday, April 30, 2021

మే డే సందర్బంగా కొన్ని నిజాలు తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలు.

హైదరాబాద్ : 01/05/2021

*ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు... ప్రజా సంకల్పం & link Media*

*మే డే సందర్బంగా కొన్ని నిజాలు తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలు.*

తెలంగాణ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ వుంటే రెవిన్యూ కోర్టు & ట్రిబ్యునల్ & ప్రజావాణి లో ఎన్నో సంవత్సరాలనుండి పెండింగ్ లో వున్న కేసులను ఈరోజు వరకు పట్టించుకోకుండా ఇంత తొందరగా @ఈటెల రాజేందర్ గారి భూముల విషయంలో హడావిడి చేయడం వెనుక రహస్యం ఏమిటో ముఖ్యమంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి.

భూసమస్యలు ప్రభుత్వం సకాలంలో పరిష్కారం చేయక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కేసీఆర్ సారు ఏనాడూ స్పందించలేదు ఎందుకు ??. అంటే ప్రభుత్వం అసలు రంగు బయటపెట్టే వారిమీద మీరు ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజలు గమనిస్తూ వున్నారు. వేల ఎకరాలు మీ MLA లు & MLC లు & మీ ప్రజాప్రతినిధులు..... చెప్పాలంటే సరిపోరు అంతమంది భూకబ్జాలు చేస్తూ వున్నారు వారి గురించి సోషల్ మీడియా వాస్తవాలు తెలిపినా మీరు ఏనాడూ స్పందించలేదు ఎందుకు ??.

దేశ చరిత్రలో ఎందరో నిరంకుశంగా నియంతగా పాలించిన నాయకులు ఎలా చివరికి ప్రజల ఆగ్రహానికి గురియ్యారో చూసాము.

సీఎం సారు ఈరోజు అధికారులకు ఎలా ఆదేశాలు ఇచ్చారో అలాగే రెవిన్యూ ట్రిబ్యునల్ లో వున్న కేసుల పరిష్కారానికి తక్షణమే ఆదేశాలు ఇచ్చి అవినీతికి ఆస్కారం ఇవ్వని అధికారులచే విచారణ చేయించి రైతులకు న్యాయం చేయాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.

ధన్యవాదములు

*Copy to Group link Media*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment