Thursday, April 8, 2021

ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులకు సిబ్బందికి ఊరటనిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్

Hyderabad : 09/04/2021
@TelanganaCMO (ట్విట్టర్)
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి రూ. 2000 ఆపత్కాల ఆర్థిక సాయం, రేషన్ షాపుల ద్వారా కుటుంబానికి 25 కేజీల ఉచిత బియ్యం: సీఎం శ్రీ కేసీఆర్ https://t.co/7g0VflHQLi

ఇందుకు సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, ఇతర వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం తెలిపారు.
విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మలను రేపు ఉదయం 11:30 గంటలకు బీఆర్కె భవన్ లో ఇందుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
ఈ వీడియో కాన్పరెన్సులో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డిఈవోలు, పౌరసరఫరాల శాఖ డిఎస్వోలు, ఇతర సిబ్బంది పాల్గొంటారు. ఇందుకు సంబంధించి విధివిధానాల రూపకల్పన, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేయనున్నారు.
ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 50 వేల మందికి లబ్ధి చేకూరుతుంది.
ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 50 వేల మందికి లబ్ధి చేకూరుతుంది.

No comments:

Post a Comment