Thursday, April 15, 2021

దేశవ్యాప్త లాక్‌డౌన్‌: నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ : 15/04/2021

దేశవ్యాప్త లాక్‌డౌన్‌: నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప‍్తంగా కరోనా వైరస్‌ రెండవ దశలో తీవ్రంగా విజృంభిస్తున్న తరుణఃలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 విస్తరణను అడ్డుకునే చర్యల్లో ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్  విధించబోదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించమని, స్థానికంగానే నియంత్రణా చర్యల్ని చేపడతామని ఆమె  వెల్లడించారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను  సంక్షోభంలోకి నెట్టడం తమకిష్టంలేదని ఆమె  పేర్కొన్నారు.  ఆయా కంటైన్‌మెంట్ జోన్లలో కఠిన చర్యలపై మాత్రమే ఆధారపడుతుందని  అన్నారు. ఆయా రాష్ట్రాల  కోవిడ్‌ సమాచారాన్ని సేకరించామని, చర్యలు బావున్నాయని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్‌పాస్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో కేంద్ర మంత్రి  ఈ వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలతో పాటు ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్ ప్రభావాలపై మాట్లాడారు. కరోనా సెకండ్‌వేవ్‌లో కూడా, తామె  పెద్ద ఎత్తున లాక్‌డౌన్‌  దిశగా  పోవడంలేదన్నారు.  టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, కరోనా నిబంధనలు లాంటి  ఐదు స్థంభాల వ్యూహంతో కరోనాను కట్టడి చేస్తామన్నారు. అలాగే వైరస్‌ బారిన పడిన వారి హోం క్వారంటైన్ చేస్తామన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే భారతదేశానికి ఆర్థిక లభ్యతను, రుణ సామర్థ్యాన్ని పెంచేందుకు  ప్రపంచ బ్యాంక్ చేపట్టిన చర్యలను సీతారామన్ ప్రశంసించారు.
కాగా దేశంలో రికార్డు కేసులతో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రెండు లక్షలకు చేరువలో ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈ నేపథ‍్యంలో పలు రాష్ట్రాలు  ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ  అమలు  చేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని, రాష్ట్రాలే కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష‍్టం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కఠిన నిబంధనలు అమలు చేయాలని ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.

@సాక్షి మీడియా సౌజన్యంతో

No comments:

Post a Comment