Thursday, April 8, 2021

కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదు !!

హైదరాబాద్ : 08/04/2021

కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదు !!

శిక్ష పడినా అప్పీలు చేసుకోవచ్చనే ధీమా...
ధిక్కరణ కేసుల్లో హైకోర్టు వ్యాఖ్య

న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయడమంటే అధికారులకు లెక్కలేదని, కోర్టు ధిక్కరణ కింద శిక్ష పడినా అప్పీలు చేసుకోవచ్చనే ధీమా వ్యక్తమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇదే మాదిరి అప్పీలు దాఖలు చేసిన సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీవో ఎస్‌.శ్రీను, ఎమ్మార్వో ఉమాదేవిలపై ఉన్న ధిక్కరణ కేసుల వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. పాస్‌ పుస్తకాలను జారీ చేయాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఈ అధికారులకు రెండు నెలల జైలు శిక్ష, 2 వేల జరిమానా విధిస్తూ సింగిల్‌ జడ్జి గత ఏడాది తీర్పు వెలువరించారు.

*link Media SVL🖋️*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment