Saturday, May 27, 2023

ఎన్టీఆర్ శత జయంతి నివాళులు

*ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్....!*

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి రామకృష్ణతో పాటు పలువురు నివాళులర్పించారు.ఎన్టీఆర్ శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు.. రాజకీయ రంగంలోనూ అగ్రగామిగా వెలుగొందారని తెలిపారు. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment