Thursday, May 25, 2023

జంట నగరాలను కాపాడుకుందాం!!(GO 111)

జంట జలాశయాలను రక్షించుకుందాం !  
జంట నగరాలను కాపాడుకుందాం!! 

జీవో.111 రద్దు పై సదస్సు పిలుపు. 
జీవో  111 రద్దు పర్యవసానాలపై హైదరాబాద్ జిందాబాద్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం, తెలంగాణ  సమాఖ్య, టీఎస్ఎంఎఫ్ ఆధ్వర్యంలో  సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి లోని గురుస్వామి సెంటర్ హాల్లో సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రముఖ పర్యావరణవేత్తలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్ దొంతి  నర్సింహారెడ్డి, రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ కే. బాబు రావు, ఆకునూరి మురళి ఐ.ఏ.ఎస్, హైకోర్టు అడ్వకేట్ రచనా రెడ్డి, హైదరాబాద్ జిందాబాద్ నాయకులు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి,  హైదరాబాద్ జిందాబాద్ నాయకులు ఎం. శ్రీనివాసరావు, ఇంజనీర్ పిట్ల నాగేష్ తదితరులు పాల్గొన్నారు. 
తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు.

No comments:

Post a Comment