Saturday, May 6, 2023

అక్రమ అడ్మిషన్లు చేసిన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి... టి.వీరేందర్ గౌడ్


*"అక్రమ అడ్మిషన్లు చేసిన కాలేజీ యాజమాన్యంపై చర్యలు చేపట్టకుండా బాధితులైన విద్యార్థుల మీద పోలీసుజులం ప్రదర్శించడం ఏమిటి: వీరేందర్‌ గౌడ్‌"*

➡️ ఇబ్రహీంపట్నం పరిధిలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ మరియు గురునానక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో అడ్మిషన్లు పొందిన దాదాపు 4,000 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించని నేపథ్యంలో..

➡️ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ అనుమతులు లేకుండా అక్రమంగా అడ్మిషన్లు చేసుకొని వేలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాలేజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా, విద్యార్థులకు సంఫీుభావంగా ఏబివిపి కార్యకర్తలు కాలేజీ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుండగా,పోలీసులు వచ్చి లాఠీ చార్జ్‌  చేశారు.కొందర్ని అక్రమంగా నిర్బంధించారు.

➡️ విషయం తెలుసుకొన్న వెంటనే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తూళ్ల వీరేందర్‌ గౌడ్‌ ఏబివిపి కార్యకర్తలను,విద్యార్థులను పరామర్శించారు.

➡️ అక్రమ అడ్మిషన్లు చేసిన కాలేజీ యాజమాన్యంపై చర్యలు చేపట్టకుండా బాధితులైన విద్యార్థుల మీద పోలీసుజులం ప్రదర్శించడం ఏమిటని వీరేందర్‌ గౌడ్‌ ప్రశ్నించారు. 

➡️ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంటూ ప్రభుత్వం విద్యార్థులకి న్యాయం చేయాలని, కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️ తరువాత తోపులాటలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రిలో పరామర్శించారు..

➡️ ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్త అశోక్ గౌడ్ గారు,బీజేపీ ఓబిసి మోర్చా కార్యవర్గం సభ్యులు కౌకుంట్ల రవితేజ గారు,రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ బి.మహేష్ యాదవ్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment