Friday, May 12, 2023

అందరూ బెంగళూరు వచ్చేయండి

*అందరూ బెంగళూరు వచ్చేయండి....ప్రలోభాల భయంతో అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు....!*

బెంగళూరు: ఇన్ని రోజులు కర్ణాటక ప్రచారంతో హోరెత్తింది. ఓటింగ్‌ ముగిసిన నాటి నుంచి ఇప్పుడు నేతల్లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి.ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ప్రకారం హంగ్‌కు ఎక్కువ అవకాశం ఉండటంతో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. 'ఆపరేషన్ కమలం'లో తమ ఎమ్మెల్యేలు చిక్కకూడదని కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అభ్యర్థులు బెంగళూరు వచ్చేయాలని, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండాలని సూచించింది. రేపు ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో హస్తం పార్టీ ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది. హంగ్‌ అవకాశం ఉంటుందని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించినప్పటికీ.. భాజపా, కాంగ్రెస్ తమకే పూర్తిస్థాయి మెజార్టీ దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే అంచనాలకు తగ్గట్టుగా హంగ్ వచ్చినా.. అధికార పీఠం కోసం ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు రెండుపార్టీలు వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment