Thursday, May 25, 2023

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు!

*కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు!*
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను కేంద్రం ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వానికి దీటుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో వేడుకలు జరపాలని నిర్ణయించింది.ఈ వేడుకల్లో భాగంగా మువ్వన్నెల జెండా ఆవిష్కరణ, పారా మిలటరీ దళాలు కవాతు చేయనున్నాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పలువురు కేంద్ర మంత్రులు రానున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు భాజపా శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment