Sunday, October 6, 2024

*సికింద్రాబాద్ టు గోవా కొత్త రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి*

*సికింద్రాబాద్ టు గోవా కొత్త రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి*

హైదరాబాద్‌: నగరం నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు.రెగ్యులర్‌ సర్వీసులు సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 9న, వాస్కోడగామా నుంచి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్‌-వాస్కోడగామా (17039) రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో.. వాస్కోడగామా-సికింద్రాబాద్‌ (17040) రైలు ప్రతి గురు, శనివారాల్లో బయల్దేరుతాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌-వాస్కోడగామా మధ్య రెగ్యులర్‌ సర్వీసు (17603) ఉంది.

అది మంగళ, బుధ, శుక్ర, ఆది వారాల్లో నడుస్తోంది. ప్రయాణికుల నుంచి తీవ్ర డిమాండ్‌ ఉండటంతో ఈ రైలు ఎప్పుడూ కిటకిటలాడుతుంది. హైదరాబాద్‌ నుంచి వాస్కోడగామాకు మరో రైలు (17021) ఉంది. కానీ వారంలో ఒక రోజు మాత్రమే నడుస్తుంది. ఇందులోనూ టికెట్లు దొరకడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో కొత్త రైలు పర్యాటకుల ప్రయాణ అవకాశాల్ని పెంచనుంది. అదనంగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

Courtesy / Source by :
*V.S. జీవన్*

No comments:

Post a Comment