Thursday, October 10, 2024

_• దేశ చరిత్రలో తొలిసారి..ఐ.పి.ఎస్. మీదే ఆరోపణలు_*

*_న్యాయ విచారణ షురూ.!_*
_• దేశ చరిత్రలో తొలిసారి_
_• ఐ.పి.ఎస్. మీదే ఆరోపణలు_
_• తప్పించుకోలేక తప్పుడు కేసులు_
_• ఇద్దరి ఉద్యోగులపై చర్యలకు శ్రీకారం_
_• శాఖాపరమైన విచారణ ప్రారంభించిన ఖమ్మం న్యాయస్థానం_
_# ముందే చెప్పిన 'ఆదాబ్ హైదరాబాద్'_

*_చట్టాలను కాపాడాల్సిన పోలీసు అధికారులు న్యాయ వ్యవస్థను తమ ఇష్టారాజ్యంగా వాడుకున్న అసాధారణ సంఘటన ఇది. భారతదేశ చరిత్రలో పోలీసు వ్యవస్థకు ఓ అధికారి కారణంగా తలవంపులు. అంతర్జాతీయ మీడియా ప్రశ్నలకు జవాబు చెప్పుకోలేని దుస్థితి. మేకపోతు గాంభీర్యం ఎందుకు.? తప్పు జరిగింది... న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టించినట్లు ఒప్పుకుంటే కనీసం 'ఆ నలుగురు'తో సరి. లేదంటే కాలమే ఈ 'న్యాయవిచారణ' రూపంలో సమాధానం చెపుతుంది._*

*_ఇదో దౌర్భాగ్యం_*
దేశంలో నేరగాళ్లు వందమంది తప్పించుకున్నా పర్వాలేదు. కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే అత్యున్నత ఆశయంతో మనదేశంలోని ప్రతి న్యాయస్థానం సగర్వంగా వందకోట్ల ప్రజానికానికి పెద్ద దిక్కుగా సేవలందిస్తోంది. సత్యం మాత్రమే పలకాలని జాతిపిత ఫొటో ప్రతి కార్యాలయంలో కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజా పన్నులతో జీతాలు పొందుతున్నారని తెలుసు. పోస్టుమ్యాన్, డ్రైవర్లు, గుర్ఖాలు, అటవీ అధికారులు, పోలీసులు ఖాకీ రంగు దుస్తులలో ఇలా ప్రతినిత్యం ప్రజలకు సేవలందించేవారే. మరి ఒక్క పోలీసు మాత్రమే న్యాయ వ్యవస్థకు ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తుంది. రక్షణ కల్పించడానికి మాత్రమే పోలీసు ఉద్యోగి అహర్నిశలు కష్టపడే వారెందరో ఉన్నారు. ఈ కథనం పోలీసుశాఖకు వ్యతిరేకం కాదు. అందులోని నీచ, నికృష్టులకు చెంపదెబ్బ లాంటిది. న్యాయవ్యవస్థను వికృత అధికారులు ఎలా తప్పుదారి పట్టిస్తూ, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళారు. ప్రతిది పక్కాగా చేశామని ధీమాతో ఆ ఆధారాలన్నీ ఇచ్చారు. నాలుగేళ్ళ పాటు బాధితుడు రావు (పేరు మార్చడం జరిగింది) అనేక ఆధారాలను సంపాదించాడు. అందులో వీడియోలు కూడా ఉండటం విశేషం. ఈ కథనంలోని ప్రతి అక్షరం లిఖితపూర్వక ఆధారాలతో 'ఆదాబ్ హైదరాబాద్' సేకరించి అందిస్తున్నది. తెలుగు జర్నలిజంలో ఓ ట్రేడ్ మార్క్ స్టోరీ.

*_తాజాగా....ఇద్దరు న్యాయశాఖ ఉద్యోగులపై విచారణ_*
ఫిర్యాదు కంటే ముందే కేసు పత్రాలు ఖమ్మం న్యాయస్థానంలో ప్రత్యక్షమవడంతో పాటు హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా, క్రిమినల్ కేసు విచారణ సాగడానికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు న్యాయశాఖ ఉద్యోగులపై విచారణ చేపట్టారు. ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి మంగళవారం ఫిర్యాదుదారుడితో పాటు ఇద్దరు న్యాయశాఖ ఉద్యోగులను విచారించారు. ఖమ్మం మేజిస్ట్రేట్ కోర్టులో 2013లో జరిగిన ఈ సంఘటనపై జిల్లా జడ్జి ఆదేశాలతో విచారణ జరుగుతోంది. తదుపరి విచారణను వచ్చేనెల 2కు వాయిదా వేశారు.

*_ఇదీ కథ_*
2013, ఆగస్టు15వ తేదీ.. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని ఒకటవ టౌన్ పోలీసు స్టేషన్... దేశం నెవ్వెరపోయే కుట్రకు తెర లేచింది. ఎఫ్.ఐ.ఆర్, ఇతర ప్రక్రియలకు రోజుల తరబడి చేసే పోలీసులు ఈకేసులో కేవలం 11 నిమిషాలలో ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడం గమనార్హం. ఉదయం ఆరు గంటలకు ఫిర్యాదు. జనరల్ డైరీలో ఎంట్రీ, వెంటనే ఎఫ్.ఐ.ఆర్. ఆ వెంటనే పంచనామాలు పూర్తి. 200 కి.మీ. దూరంలోని హైదరాబాద్ లోని నిదింతుని ఇంటకు ఉదయం 6.17 నిమిషాలకే చేరుకున్న పోలీసులు. ఇది ఎలా సాధ్యం అని అడిగితే వారు వచ్చిన ట్రాన్స్ ఫోర్ట్ లేఖను అందించారు. అందులోని కేసు వివరాలలోకి వెళితే అది పోలీసుల చేతులలో ముగిసిన కేసుగా తేలింది.

*_హైకోర్టు ఆదేశాలా..? అయితే ఏంటి..?_*
ఈ కేసులో 'అన్ని చర్యలు ఆపుచేయాలని' రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబరు 4వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు అటు పోలీసుశాఖకు, ఇటు న్యాయశాఖకు అదే నెల 17న అందాయి. అయితే తాము చాలా.. చాలా గొప్పోళ్ళమని భావించే ఖాకీ ఉద్యోగి హైకోర్టు ఆదేశాలను 'త్రోసి రాజు' అంటూ 19వ తేదీన చార్జిషీట్ వేశారు. అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన న్యాయాధికారులు విషయాన్ని పట్టించుకోలేదు. తాము ప్రతిదీ ఖచ్చితంగా చేశామని లిఖితపూర్వకంగా రాసి మరీ వ్యవస్థలన్నింటినీ నాలుగేళ్ళుగా పోలీసులు పక్కాగా నమ్మించారు. ఈ విషయాలన్నీ నాటి సి.. వెంకటేష్, ఈ కేసు విచారణ అధికార హోదాలో దృవీకరించి మరీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఏ.సి.పిగా ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాటి జిల్లా ఎస్పీ ప్రమేయం ఉన్నట్లు అనేకసార్లు బాధితుడు చెప్పాడు. ఆయన
అరుపులు అరణ్య రోదనగా మిగిలింది. అంతా పోలీసులదే నిజమని ఇప్పటి వరకు నమ్మారు.

*_దటీజ్ హైకోర్టు_*
'ఏ పోలీసు స్టేషనులో అయిన ఎఫ్.ఐ.ఆర్. అయితే 24 గంటలలోగా సంబంధిత న్యాయస్థానానికి ఆ విషయాన్ని తప్పక తెలియజేయాలి' అనే నిబంధన ఉంది. అన్యాయం తాత్కాలికంగా నిజమనే భ్రమలో ఉంచుతుంది. నిజం నిలకడ మీద తెలుస్తోంది. అన్న చందాన బాధితుడు న్యాయశాఖలోని రికార్డులు సంపాదించాడు. ఫిర్యాదు ఆగస్టు15, ఉదయం ఆరు గంటలకు ఎఫ్.ఐ.ఆర్. అయితే ఆ రోజు జాతీయ సెలవు దినం కావడంతో ఆగస్టు 16వ తేదీన న్యాయస్థానానికి ఆ ఎఫ్.ఐ.ఆర్ చేరాలి. కానీ ఆగస్టు 14న అవే సెక్షన్లు, అదే ఎఫ్.ఐ.ఆర్ అందినట్లు సంబంధి న్యాయాధికారి రిజిస్టర్ లో స్వయంగా సతంకం చేశారు. అంటే ఫిర్యాదు కన్న ఒకరోజు ముందే న్యాయస్థానానికి చేరింది.

Courtesy / Source by :
"ఆదాబ్ హైదరాబాద్ మీడియా"

No comments:

Post a Comment