Wednesday, July 31, 2024

హైదరాబాద్ చేరుకున్న నూతన గవర్నర్.... స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

*హైదరాబాద్ చేరుకున్న నూతన గవర్నర్.... స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి*

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. బుధవారం త్రిపుర నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న నూతన గవర్నర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, గవర్నర్ కార్యదర్శి బి.వెంకటే,శం ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.అనంతరం శంషాబాద్ విమానాశ్రయంలో నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే జిష్ణు దేవ్ వర్మ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నేత కేసీఆర్, విపక్ష పార్టీల నేతలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.

Courtesy / Source :
*V.S.జీవన్*

No comments:

Post a Comment