Saturday, July 27, 2024

బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశాలకు ఆoక్షలు ఎందుకు?

మానవహక్కులవేదిక :
*సుందరయ్య విజ్ఞానకేంద్రం లో సమావేశాలు నిర్వహణపై ఆoక్షలు రద్ద చేయాలి*   
బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశాలు నిర్వహించాలంటే ముందుగా చిక్కడపల్లి పోలీసుల నుండి అనుమతి తీసుకోవాలని, లేనిపక్షంలో సుందరయ్య  భవన్ లో ఉన్న ట్రస్ట్ యాజమాన్యం, హాలు కోసం బుకింగ్స్ తీసుకోవడం లేదని, ఈ విషయంలో మానవహక్కుల వేదిక సంస్థ, తెలంగాణ డి.జి.పి. కి ఒక లేక రాసింది.

తెలంగాణ  రాష్ట్రంలో  అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర భాద్యత చేపట్టిన ముఖ్యమంత్రి తెలంగాణ లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు కృషి చేస్తామని పౌర స్వేచ్ఛను, పౌర హక్కులను కాపాడుతామని బహిరంగంగా ప్రకటిం చారు, అసెంబ్లీ లో కూడా ప్రకటన చేసారు. చిక్కడపల్లి  పోలీసులు సుందరయ్య భవన్ యాజమాన్యం కు పంపిన ఆదేశాలు ముఖ్యమంత్రి బహిరంగంగా అసెంబ్లీ లో ప్రకటించిన  ప్రజలకు  ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఉన్నాయని, ఈ విషయంలో DGP గారిని జోక్యం చేసుకొని చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీ .శేషాద్రి గారికి, హాంశాఖ కార్యదర్శికి కూడా లేఖలు రాసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చి  జోక్యం  చేసుకోవాలని కొరినట్టు సంస్థ ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు యస్.జీవన్ కుమార్, వేమన వసంత లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి డా. ఎస్.తిరుపరుపత య్య గార్లు పత్రికలకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు,

No comments:

Post a Comment