Wednesday, July 31, 2024

పాత్రికేయులు రాజకీయల్లోకి రావలసిందే..!

.
పాత్రికేయులు రాజకీయల్లోకి రావలసిందే..!
( హైదరాబాద్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకాగ్రీవ తీర్మానం)


అవినీతి, నేర రహిత నిస్వార్థ సమాజం కోసం నిరంతరం కష్టపడే పాత్రికేయులు నేరుగా రాజకీయల్లోకి రావలసిన ఆవశ్యకత ఏర్పండిందని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్, తెలుగు రాష్ట్ర సంక్షేమ సంఘం, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పాత్రికేయుల రాజకీయ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ సందర్బంగా బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జీరో బేస్ డ్ బడ్జెట్ పాలిటిక్స్, నవ సమాజ స్థాపన, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, నిరుద్యోగ యువత భవిష్యత్, అవినీతి - నేర రహిత, నిస్వార్థ సమాజ నిర్మాణం వంటి అంశాలపై ప్రముఖులు, మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జైళ్ల శాఖ రిటైర్డ్ ఐజి నర్సింహులు, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ బిఎస్‌.రాములు, ఏడబ్ల్యూజేఏ జాతీయ అధ్యక్షుడు కె.కోటేశ్వర్‌రావు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరావు, ఏడబ్ల్యూజెఎ జాతీయ కో-ఆర్డినేటర్ గిరిరాజ్ బెలిదే హరినాధ్, ఏడబ్ల్యూజెఎ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు నామాల విశ్వేశ్వర రావు, ఏడబ్ల్యూజెఎ సలహాదారు గిరి రాజు, సామాజిక తెలంగాణ ప్రంట్ మహిళా నాయకురాలు, ఉద్యమకారిణి అరుణ, 'జీరో' బడ్జెట్ పాలిటిక్స్ మాధవ రెడ్డి, ఏడబ్ల్యూజెఎ తెలంగాణ ప్రధాన కార్యదర్శి బిఎల్ఎన్ ప్రసాద్, టిజేఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, ఏడబ్ల్యూజెఎ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి,TJSS తెలంగాణ సోషల్ మీడియా ఇంచార్జి బాపట్ల కృష్ణమోహన్, చింతకాయల వెంకటేశ్వర్లు, పురుషోత్తం, రాజనర్సింహ, వెంకటరమణ, రవి, రవికుమార్, శ్రీనివాస్, బ్రహ్మం పలువురు సీనియర్ పాత్రికేయులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సామాన్య ప్రజలు తమ అభిప్రాయాలను పంపటానికి ఉచిత అంతర్జాలాన్ని అతిథులు ఆవిష్కరించారు

No comments:

Post a Comment