Wednesday, July 24, 2024

Haffizpet Land Scam 1000Cr

Haffizpet Land Scam 1000Cr

బీఆర్ఎస్ భూ మాఫియాను అధికారులు కంటిన్యూ చేస్తున్నారా..?

హాఫిజ్ పేట్ పాయిగా ల్యాండ్ రికార్డులో మార్పులు.

జూన్ 14 వరకు ప్రభుత్వ భూమిగా ఉన్న 1000 కోట్ల ఆస్తి.

జూన్ 17 నాటికి పట్టా ల్యాండ్ గా మార్చిన రంగారెడ్డి కలెక్టర్.

దశల వారిగా హైకోర్టుకు తప్పుడు సమాచారం.

అనుకూలమైన వారిపై అప్పిల్ కి వెళ్లని వైనం.

వివవాదస్పదమైన టైటిల్ పై మ్యూటేషన్.

జస్టిస్ నవీన్ రావు, ఎంఎస్ ఆర్ తీర్పుల్లో ఎంతో తేడా..?

అప్పటి కలెక్టర్ శ్రీధర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏమైంది. ?

విచారణ పూర్తి ముగియకుండానే 10 ఏండ్ల క్రితం ఫైల్ మ్యూటేషన్ చేసేశారు.

మూడు రోజుల్లో 24 ఎకరాలు పట్టాగా మార్చేశారు.

800 మంది ప్లాట్ ఓనర్స్ కి లోయర్ కోర్టు ఆర్డర్స్ మర్చిపోయారా..?

చర్చి జాగాలో లార్డ్ ఇక్బాల్ అలీఖాన్ ఫోర్జరీ సంతకాలేంటీ?

పీఎస్ రెడ్డి భార్య విజయరెడ్డికి చేసిన అసైన్మెంట్ డీడ్ లో జరిగిందేంటి.?

హాస్తం పార్టీ అధికారంలోను ఆ ఆఫీసర్స్ అదే దందాలు కొనసాగిస్తున్నారు..?

ఎవ్వరి ఒత్తిళ్లు పనిచేశాయి.?

లక్షల కోట్ల వివాదస్పద భూముల పై రియల్ మాఫియా పట్టుసాధిస్తుందా..?

హాఫీజ్ పేట్ ల్యాండ్స్  లాస్ట్ అప్డెట్స్ పై ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ప్రత్యేక కథనం.

Courtesy / Source by :

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల (9848070809), Lands & Records.

హైదరాబాద్ భూములంటే బంగారు బాతులాంటివి. నాయకులు ఒక్క సెటిల్మంట్ తో వందల కోట్లు పోగేసుకుంటారు. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ని కోర్టుకు తప్పుడు నివేదికలు ఇస్తూ భూ దందాలు చేస్తుంటారు. నేతలు చెప్పినట్లు అధికారలు వినడంతో తలకొంత పంచుకుంటూ విలువైన భూములపై వేల కోట్ల వ్యాపారం చేస్తుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో 3 లక్షల కోట్ల వివాదస్పద భూములను క్లియర్ చేసుకున్నారు. రెవెన్యూ, పోలీస్, న్యాయశాఖ సహాకారాలతో వారి చేసిందే చట్టంలా వ్యవహారించారు. వేల కోట్ల భూముల సమస్యలకు పరిష్కారం చెప్పుతూ ఫర్సెంటెజీలు పంచుకున్నారు. అద్దాల భవంతులు నిర్మించి అమ్మేసుకున్నారు.  వారు చేసిన భూ అక్రమణల పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఇప్పుడు అదే దందాలు అధికారుల సహాకారంతో కొంత మంది చేస్తున్నట్లు కనిపిస్తుంది. హాఫీజ్ పేట్ లోని వెయ్యి కోట్ల విలువచేసే 24 ఎకరాల 35 గుంటల పై రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చూస్తే ఇట్లే తెలిసి పోతుంది.

హిస్టరీ ఇదే.

హిఫీస్ పేజ్ సర్వే నెంబర్ 77 లోని 64 ఎకరాలు 1981లో హిందుస్తాన్ ఏరో నాటికల్ లిమిటెడ్ సోసైటీ కొనుగోలు చేసింది.  ఇందులో కల్వరి టెంపుల్ లార్డ్ అలీఖాన్ ఫోర్జరీ సంతకాలతో  20 ఎకరాల వరకు అక్రమించుకుంది. మరో 25 ఎకరాల్లో వెదిరి ఎస్టేట్ వాళ్లు చుట్టు రేకులు పెట్టేశారు. ఈ భూ వివాదం సీఎస్ 14/1958కి చెందింది. 813 మంది ఉద్యోగులు కలిసి సోసైటి పెట్టుకుని భూమి తీసుకున్నారు. ప్రభుత్వం- పాయిగా ల మధ్య కోర్టు కేసుల్లో నలుగుతుంది. పాయిగా ఫ్యామిలీలో నుంచి కొంత మంది డిఫెండెండ్స్ వద్ద నుంచి కొనుగోలు పూర్తి అయింది.  అయినా చాలా మందికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వెదిరి ఎస్టేట్ అక్రమించుకున్న 25 ఎకరాల్లో టైటిల్ లేకుండానే ఇప్పుడు మ్యూటేషన్ పూర్తి అయింది. అగష్టు 16, 2004లో పుత్తి సదాశివ రెడ్డి (పీఎస్ రెడ్డి) చనిపోయారు.. జూన్ 10, 2005లో ఆయన భార్య విజయారెడ్డి కు టైటిల్ లేకుండానే అసైన్మెంట్ డీడ్ ప్రకారం వెదిరి ఎస్టేట్ కి సెల్ డీడ్ చేశారు. జూలై 6, 2002న చేసిన అసైన్మెంట్ డీడ్ కి ఇండియాన్ రిజిస్ట్రేషణ్ యాక్ట్ 1908. సెక్షన్ 23 ప్రకారం 4 నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. కాని ఎప్రిల్ 4, 2005లో అమె పేరు మీదికి వ్యాలుడేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత జూన్ 10,2005న వెదిరికి అమ్మేయడం చట్టవిరుద్దమని అసలు పీఎస్ రెడ్డికి అసైన్మెంట్ డీడీ చేయాడంలో అమ్మినవారికి టైటిల్ లేదని అప్పటి కలెక్టర్ శ్రీధర్ హైకోర్టుకు దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక అధారంగానే జస్టిస్ నవీన్ రావు రిట్ పిటిషన్ 27045 ఆఫ్ 2013 ఆర్డర్ లో ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 81,82,83 ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ ని క్యాన్సల్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీని పైనే మళ్లీ మ్యూటేషన్ చేయాల్సిందిగా రిట్ నెంబర్ 15056/2014 లో వెదిరి ఎస్టేట్ వాళ్లు పిటిషన్ దాఖలు చేశారు. అన్ రిజిస్ట్రర్డ్ అసైన్మెంట్ డీడ్ లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రకారం చేయాలని గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదికను, ఫ్లాటింగ్ జరిగిన వ్యవహారాన్ని దాచిపెట్టి సైరస్ ఇన్వెస్టిమెంట్, ఎంతో మంది ఉన్న ఢిపెండెట్స్ వద్ద నుంచి అగ్రిమెంట్లు చేgసుకున్నామని కోర్టుకు తెలిపి 2015లో మ్యూటేషన్ చేసేలా కలెక్టర్స్ కి అదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మరో సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అప్పటి నుంచి 2023 వరకు ఆ భూమిని మ్యూటేషన్ కాలేదు. ఆనాటి రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు పై కంటెప్ట్ ఆఫ్ కోర్టు పై కేసులు వేశారు. కలెక్టర్ కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఆయన పై ఉన్న కోర్టు దిక్కరణ కేసుల పై తీర్పు ఇచ్చింది.

జస్టిస్ ఎమ్మెస్సార్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఈ ఏడాది జనవరి 23న సీసీ నెంబర్ 131 ఆఫ్ 2024ని దాఖలు చేశారు. వేదుల వెంకట్ రమణ పిటిషనర్ తరుపున వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వం తరుపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ మహ్మాద్ ఇమ్రాన్ ఖాన్ కంప్టెట్ తీర్పును అమలు చేస్తామని ఒప్పేసుకోవడంతో.. మూడు రోజుల్లోనే అంటే 17-06-2024న వెదిరి ఎస్టేట్ పై మ్యూటేషన్ చేస్తూ పాస్ బుక్స్ ఇష్యూ చేస్తున్నారు. దీంతో వెయ్యి కోట్ల భూమి ఇట్లే క్లియర్ అయిపోయింది. ఇదే పాయిగా భూముల్లో ఇప్పటికి సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. HAL ఎంప్లాయిస్ ఓ.ఎస్ నెంబర్. 359/2001 లో 2008లో టైటిల్ పై ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది రంగారెడ్డి కోర్టు.  నాలుగు వాయిదాల్లోనే అడిషనల్ అడ్వకేట్ కంటెప్ట్ పై ఉన్న తీర్పును అమలు చేస్తామని కోర్టుకు తెలియచేస్తాను. సుప్రీం కోర్టులో ఇదే భూముల పై ఎస్ ఎల్ పీ 2844/2021 సుఖేష్ గుప్తా భూమి పై ఇప్పటికి విచారణ కొనసాగుతుంది. ఇలా అనేక కేసులను మేర్జ్ చేసి టైటిల్ తో పాటు భాగస్వామ్యం చేసిన ప్రాపర్టీస్ పై అడ్వకేట్ కమిషన్ నివేదికలు పటాపంచల్ అవుతున్నాయి. నవీన్ మిట్టల్ కి హైదరాబాద్ ల్యాండ్స్ ని తెలివిగా చేతికి మట్టి అంటకుండా ఎలా చేయాలో వెన్నతో పెట్టిన విద్య. అందుకే అయన డైరెక్షన్ లోనే ఓ మంత్రి, మరో కీలక నేత ఈ తతంగం ముందు ఉండి నడిపించినట్లు తెలుస్తుంది. మరిన్ని భూములను క్లియర్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాడి ఏడాది పూర్తి కాకుండానే అన్ని వ్యవస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకున్నట్లు ఈ ప్రభుత్వం వాడేసుకునేందుకు సిద్దమయినట్లు తెలుస్తుంది.  


*@TelanganaCMO @TelanganaCS*
*@PrlsecyMAUD*
*@CPRO_TGCM @IPRTelangana @CollectorRRD @ACLB_Rangareddy @GHMCOnline @HMDA_Gov @CommissionrGHMC*

https://x.com/Praja_Snklpm/status/1816077013876392117?t=lX_JQToWx2Azy-Tri-_lfQ&s=19


No comments:

Post a Comment