Monday, July 24, 2023

ధరణి పోర్టల్ తో అద్భుతాలు.... సీఎం KCR....!

*ధరణి పోర్టల్ తో అద్భుతాలు.... సీఎం KCR....!*

హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ధరణిలో భూమి వచ్చిందంటే ఎవడూ మార్చలేడని.. నీభూమి హక్కు నీ బొటన వేలుతో మాత్రమే మార్చేలా తీసుకొచ్చామన్నారు.ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా రావాలని అని ప్రశ్నించారు. ధరణితో భూమి సేఫ్‌, రైతు బంధు డబ్బులు నేరుగా బ్యాంకులోనే పడతాయని చెప్పారు. 

యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అనిల్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్‌. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ మాట్లాడుతూ.. త ముఖ్యమంత్రులు కరెంట్‌ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కరెంట్‌ లేక గతంలో పోలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్‌ ఇస్తామంటే ఎవరూ నమ్మలేదని.. ప్రస్తుతం.రాష్ట్రంలో మూడు పంటలు పండుతున్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment