Thursday, July 13, 2023

ఉచిత విద్యుత్ పై నా వ్యాఖ్యలు వక్రీకరించారు.... రేవంత్ రెడ్డి...!

*ఉచిత విద్యుత్ పై  నా వ్యాఖ్యలు వక్రీకరించారు.... రేవంత్ రెడ్డి...!*

హైదరాబాద్‌: అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉచిత విద్యుత్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ''ఐటీ మంత్రి కేటీఆర్‌ తనకున్న ఐటీ నైపుణ్యంతో నేను వేర్వేరుగా మాట్లాడిన మాటలను ఎడిట్‌ చేసి తప్పుదారి పట్టించారు. ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వ పెద్దలతో బహిరంగ చర్చకు సిద్ధం. రైతులకు ఉచిత విద్యుత్‌ను తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన జరిగినప్పుడు కేసీఆర్‌ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.

ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కుదరదు అని ఆనాడు కేసీఆర్‌ తెదేపా ప్రభుత్వంతో చెప్పించారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత్‌ విద్యుత్‌ దస్త్రంపైనే పెట్టారు. సాగుకు 9గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఉచిత విద్యుత్‌తో పాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చింది. రాష్ట్రవిభజన తర్వాత విద్యుత్‌ విషయంలో నష్టం జరగకుండా కాంగ్రెస్‌ అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంది. వినియోగం ఆధారంగా
తెలంగాణకే ఎక్కువ విద్యుత్‌ వచ్చేలా సోనియాగాంధీ చర్యలు తీసుకున్నారు. కన తెలంగాణకు 53శాతం, ఏపీకి 47 శాతం విద్యుత్‌ కేటాయించారు. అందుకోసం అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు కృషి చేశారు. ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌ పార్టీదే'' అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment