Monday, July 10, 2023

12న పాఠశాలలు,ఇంటర్ కళాశాలల రాష్ట్ర వ్యాప్తంగా బంద్: ఎస్ఎఫ్ఐ

ప్రచురణార్ధం/ప్రసారర్ధం:
తేదీ: 10-07-2023

విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం జూలై 12న పాఠశాలలు,ఇంటర్ కళాశాలల రాష్ట్ర వ్యాప్తంగా బంద్: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేడ్చల్ మండలంలో విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని పిలుపు. నిరసన చేసి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 12 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు,ఇంటర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ఈ బంద్ లో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చాయి.
 
ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్, మాట్లాడుతూ*....
రాష్ట్రంలో కార్పోరేట్, ప్రైవేట్ ఫీజులు దందా కోనసాగుతున్న ఇప్పటికీ ప్రభుత్వం వాటి నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రులు ఉపసంఘం, తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయకపోవడం చూస్తే ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనూకులంగా వ్యవరిస్తున్నట్లుగా ఉందని అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా యూనిఫామ్ ఇవ్వలేదు, కోన్ని టైటిల్స్ పాఠ్యపుస్తకాలు పంపలేదు, చదువులు చెప్పే టీచర్లు లేరు, పారిశుద్ధ్య కార్మికులు లేరు ,అనేక సమస్యలతో విద్యాసంవత్సరం ప్రారంభమైన నిర్ధిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదు. త్రాగునీరు, మధ్యాహ్న భోజనం బిల్లుల పెండింగ్, ముత్రశాలలు, సరైన మౌళిక సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యారంగం గోల్లుమంటుంది. మన ఊరు-మనబస్తీ-మనబడి నిధులు గుత్తేదారులు తూతూమంత్రంగా మాత్రమే పనులు జరిగాయి కానీ ఎక్కడ సరిగ్గా పాఠశాలలకు ఉపయోగ పడింది లేదు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ అందని ద్రాక్షగా మారింది. ఇంటర్ విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు ఇంకా అందివ్వలేదు. లెక్చరర్స్ లేరు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి.
- రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుండి ఫీజు రీయంబర్స్ మెంట్స్& స్కాలర్ షిప్స్ 5,177 కోట్లు పెండింగులో ఉన్నాయి. వాటిని కనీసం విడుదల చేయడం లేదు.
-గురుకులాలు, కెజిబివిలు, ఇంటర్ కళాశాలలుగా అఫ్ గ్రేడ్ చేసిన కెజిబివిలు భవనాలు లేక అరకోక సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటికి నిధులు లేవు, లెక్చరర్స్, టీచర్స్ లేరు. నాణ్యమైన భోజనం లేక పుడ్ ఫాయిజాన్స్ అవుతున్న ఘటనలు కో కొల్లలు గా ఉన్నాయి. 
- రాష్ట్రంలో భారీ సంఖ్యలో టీచర్,లెక్చరర్స్ ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీ చేయడం లేదు, ఒక్క డిఎస్సీ ఇప్పటివరకు వేయలేదు. అందుకే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కదిలించి బంద్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. జిల్లాలో బంద్ విజయవంతం చేయాలని విద్యార్ధి లోకానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మండల కార్యదర్శి M.కిరణ్,యశ్వంత్, శివ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ధన్యవాదములతో....

రాథోడ్ సంతోష్
SFi జిల్లా కార్యదర్శి

No comments:

Post a Comment