Sunday, July 9, 2023

పోరాడండి... తోడుగా ఉంటాం... ఈటల కు మోదీ భరోసా....!

*పోరాడండి... తోడుగా ఉంటాం... ఈటల కు మోదీ భరోసా....!*

వరంగల్‌: ప్రధాని మోదీ ప్రసంగం ముగిశాక సభా వేదికపై ఓ వైపు నిలుచున్న రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ భుజంపై చేయి వేసి పలకరించారు.కాసేపటికి వేదిక వెనక్కి వెళ్లాక కూడా ఈటల భుజంపై చేయి వేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ''మేం అన్ని విషయాల్లో మీకు అండగా నిలుస్తాం. ధైర్యంగా పోరాడండి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయండి. పూర్తి సహకారం అందిస్తాం'' అని ఈటలతో ప్రధాని మోదీ పేర్కొన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సమయంలో పొంగులే టిని కూడా మోదీ పలకరించారు. ఇక సభా వేది క వెనకాల ఈటల, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో కేంద్ర మంత్రి గడ్కరీ కాసేపు మాట్లాడారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment