Friday, July 21, 2023

గోషామహల్ భాజపా టికెట్ నాదే.... భాజపా నేత విక్రమ్ గౌడ్...!

*గోషామహల్ భాజపా టికెట్ నాదే.... భాజపా నేత విక్రమ్ గౌడ్...!*

హైదరాబాద్‌: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ తనయుడు, భాజపా నేత విక్రమ్‌గౌడ్‌తో ఆ పార్టీ రాష్ట్రఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు.ఎంజే మార్కెట్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఈటల.. గోషామహల్‌ నియోజకవర్గంలో తాజా రాజకీయాలపై సుదీర్గంగా చర్చించారు. మొన్న గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ని, ఈరోజు విక్రమ్‌ గౌడ్‌ని ఈటల రాజేందర్‌ కలవడంపై గోషామహల్‌లో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈటలతో భేటీ అనంతరం విక్రమ్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. గోషామహల్‌ టికెట్‌ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అందుకోసం రాజాసింగ్‌ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కూడా కోరతానని చెప్పారు. తన కుటుంబానికి గోషామహల్‌ నియోజకవర్గ ప్రజలతో 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. రాజాసింగ్‌పై పెట్టిన సస్పెన్షన్‌ భాజపా కేంద్ర అధిష్ఠానం పరిధిలో ఉందని, ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆ దిశగా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని విక్రమ్‌గౌడ్‌ స్పష్టం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment