Tuesday, July 4, 2023

తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు

*తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు*

*GHMC కమిషనర్‌గా రోనాల్డ్ రోస్*

హైదరాబాద్ :జులై 04
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రోనాల్డ్ రోస్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ ఓఎస్‌డీగా ఉన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌ను అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా నియమించడంతో ఈ మార్పులు జరిగాయి. మొత్తం నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను జాయింట్ సీఈఓగా నియమించడంతో ఆ స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న ముషర్రఫ్ ఆలీ ఫారూఖీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు... 

No comments:

Post a Comment