Thursday, July 2, 2020

తెలంగాణ లో కరోనా పరీక్షలు నిలిపివేత

హైదరాబాద్ : 02/07/2020

ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిలిపివేత

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రైవేటు ల్యాబ్‌లు తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 5వ తేదీ వరకు నాలుగు రోజులపాటు శాంపిల్స్‌ సేకరణ నిలిపివేస్తున్నట్టు వెల్లడించాయి.
ఐసీఎంఆర్‌ తెలంగాణ వ్యాప్తంగా 18 ప్రైవేటు ల్యాబ్‌లకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. దీంతో గత 15 రోజుల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం ప్రైవేటు ల్యాబ్‌ల కరోనా పరీక్షల నిర్వహణను పరిశీలించి.. లోపాలను గుర్తించింది. 48 గంటల్లో  లోపాలను సవరించు కోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ల్యాబ్‌లు తప్పులను సరిదిద్దుకున్నాయి.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment